Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: స్వీడన్కు చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల సంస్థ వోల్వో.. తన తొలి ఎలక్ట్రిక్ కారు 'ఎక్స్సీ-40 రీఛార్జ్'ను త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. తాజాగా దీనికి సంబంధించిన ఫీచర్లు, ఇతర వివరాలను వెల్లడించింది. ఇదే సంస్థ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ కారు. ఒక్కసారి ఛార్జింగ్తో 400 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టంతో కేవలం 40 నిమిషాలలో 80 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది.కాంపాక్ట్ మాడ్యూలర్ ఆర్కిటెక్చర్ ఫ్లాట్ఫాంపై దీన్ని నిర్మించారు. ఇది ఎక్స్సీ-40 ఎస్యూవీ డీజిల్ ఇంజిన్ మోడల్ని పోలి ఉంటుంది. ఈ కారులో 150 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ను అమర్చారు. 78కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీతో రానున్న ఈ కారు 402 హెచ్పీ శక్తిని 659 న్యూటన్ మీటర్ టార్క్ను విడుదల చేస్తుంది. 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.9 క్షణాల్లో అందుకుంటుంది. తొలిసారిగా ఇందులో గూగుల్ ఆండ్రాయిడ్ ఆధారంగా పనిచేసే ఇన్ఫోటైన్మెంట్ సిస్టంను అమర్చారు. దీనిలో ఉన్న వోల్వో ఆన్ కాల్ సర్వీస్ ద్వారా డ్రైవర్లు కారును నడపడానికి ఎంతమేర విద్యుత్ను ఉపయోగిస్తున్నారో తెలుసుకోవచ్చు. ఈ వాహనంను ప్రపంచంలోని అన్ని దేశాలలో అందుబాటులోకి తేవాలని సంస్థ భావిస్తోంది.