Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: పండుగల సీజన్ నేపథ్యంలో తన రుణ విస్తృతిని పెంచుకొనేందుకు గాను బజాజ్ ఫిన్సెర్వ్ సంస్థ వినూత్న సందేశంతో ముందుకు వచ్చింది. దీపావళి నేపథ్యంలో తాము చాలా సులభ మార్గంలో రుణాలను అందించే విధంగా.. రుణ మంజూరీ విధానంలో పలు మార్పులు తీసుకు వచ్చినట్టుగా సంస్థ తెలిపింది. ఇందులో భాగంగా కేవలం 24 గంటల్లోనే దాదాపు రూ.25 లక్షల వరకు వ్యక్తిగత రుణం అందించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. దీనికి తోడు సామాన్య ప్రజలు తీసుకున్న రుణాన్ని దీర్ఘకాలం పాటు చెల్లించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. దీపావళి నేపథ్యంలో బజాజ్ ఫిన్సెర్వ్లో తీసుకున్న రుణాలను గరిష్టంగా 60 నెలల లోపు చెల్లించుకొనే అవకాశం ఉన్నట్టుగా సంస్థ తెలిపింది. దీపావళి నేపథ్యంలో ప్రజలకు విరివిగా రుణాలను అందించేందుకు గాను తమ సంస్థ వివిధ వ్యాపార, విక్రయ సంస్థలతో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుందని తెలిపారు. దీంతో దేశ వ్యాప్తంగా పండుల వేళ సులభంగా రుణాలు లభిస్తాయని తెలిపింది. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ గృహల్ని కొత్త వస్తువులతో శోభాయమానంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉందని సంస్థ తెలిపింది.