Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ, బెంగళూరు: ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్, సీఎఫ్ఓ నీలాంజన్ రారులపై వచ్చిన ఆరోపణలపై సంస్థ నాన్ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నీలేకని మంగళవారం స్పందించారు. గుర్తుతెలియని ఉద్యోగుల బృందం చేసిన ఆరోపణలపై ఆడిట్ కమిటీతో స్వతంత్ర దర్యాప్తు చేపట్టనున్నట్టుగా తెలిపారు. దీనిపై ఇప్పటికే కంపెనీకి చెందిన అంతర్గత ఆడిటర్లను సంప్రదించినట్టుగా వెల్లడించారు. అలాగే స్వతంత్ర దర్యాప్తు జరిపేందుకు శార్దూల్ అమర్చంద్ మంగళ్దాస్ అండ్ కంపెనీని కూడా ఆశ్రయించామని ఆయన తెలిపారు. బోర్డు సభ్యుల్లో ఒకరికి సెప్టెంబరు 20న 'సంస్థలో అనైతిక పద్ధతులు' పేరిట ఒక లేఖ, 'ప్రజావేగు ఫిర్యాదు' పేరిట మరో లేఖ అందినట్టుగా ఆయన తెలిపారు. ఈ రెండు ఫిర్యాదుల్ని అక్టోబర్ 10న ఆడిట్ కమిటీకి, మర్నాడు బోర్డులోని నాన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులకు అందజేశామన్నారు. అక్టోబర్ 11న జరిగిన బోర్డు సమావేశం తరువాత కంపెనీ అంతర్గత ఆడిటర్లను 'ఆడిట్ కమిటీ' సంప్రదించిం దన్నారు. అనంతరం పూర్తిస్థాయి దర్యాప్తు నిర్వహిం చాలని శార్దూల్ కంపెనీని కమిటీ అక్టోబర్ 21న కోరినట్లు తెలిపారు. దర్యాప్తు ఫలితం ఆధారంగా బోర్డు తగు చర్యలు తీసుకుం టుందన్నారు. అమెరికాకు చెంది న విజిల్బ్లోయర్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్కు కూడా ఉద్యోగు ల బృందం అక్టోబరు 3న ఒక లేఖ రాసిన విషయం తాజాగా తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఆరోప ణలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారా లు అందనప్పటికీ.. పూర్తి స్థాయి విచారణ జరిగేలా చూస్తామని నీలేకని చెప్పారు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న పరేఖ్, రారులను ఈ దర్యాప్తు నుంచి దూరంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
స్టాక్ మార్కెట్లలో 'ఇన్ఫీ' కలకలం!
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్లో సీఈవో సలీల్ పరేఖ్, సీఎఫ్వో నీలాంజరు రారులు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఉద్యోగులమని చెప్పుకుంటున్న గుర్తుతెలియని బృందం చేసిన ఫిర్యాదులతో దేశీయ మార్కెట్లు మంగళవారం భారీగా పతనమయ్యాయి. ఇన్ఫోసిస్ సీఈఓపై ఆరోపణలతో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్లు కుప్పకూలడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. అటు అంతర్జాతీయ మార్కెట్లు కూడా బలహీనంగానే ఉండటంతో మంగళవారం ట్రేడింగ్లో సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఎన్ఎస్ఈలో ఇన్ఫీ షేరు ధర 16.65 శాతం తగ్గి రూ. 640 వద్ద ముగిసింది. అటు బీఎస్ఈలోనూ 16.21 శాతం కుంగి రూ. 640.30 వద్ద స్థిరపడింది.