Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ప్రపంచంలో అతిపెద్ద వాణిజ్య ఒప్పందంగా చెప్పబడుతున్న 'రీజినల్ కాప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్'పై (ఆర్సీఈపీ) అగ్రిమెంట్పై ఇండియన్ కెమికల్ కౌన్సిల్ (ఐసీసీ) ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్సీఈపీలో భాగంగా పది ఆసియాన్ దేశాల మధ్య ఆరు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్టీఏ) ఒప్పందంపై నవంబరులో తుది చర్చలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ఈ ఒప్పందంపై ఆచితూచి వ్యవహరించాలని ఐసీసీ కోరింది. భారత్లోని కెమికల్ పరిశ్రమల ప్రయోజనాలను దృష్టి ఉంచుకొని భారత్ స్పందించాలని ఐసీసీ కోరింది. 'రూల్ ఆఫ్ ఆరిజన్'పై ఐసీసీ తన అభ్యంతరాలను లేవనెత్తింది. ఈ ఒప్పందం కారణంగా భారత సంస్థలకు విదేశీ సంస్థల నుంచి తీవ్ర ఒత్తిడి ఏర్పడే ప్రమాదం ఉందని ఐసీసీ డైరెక్టర్ జనరల్ హెచ్.ఎస్.కరంగే అన్నారు. ఆర్సీఈపీలో భారత్తో పాటుగా ఆస్ట్రేలియా, చైనా, న్యూజిలాండ్, జపాన్, దక్షిన కొరియాతో పాలు పలు దేశాలు భాగస్వామ్య కానున్నాయి. ఈ ఒప్పందం వల్ల కలిగే లాభనష్టాలను గురించి ప్రభుత్వ పరిశ్రమ వర్గాల అభిప్రాయాలు కోరడాన్ని ఐసీసీ ఆహ్వానించింది. తమ ప్రయోజనాలకుభంగం కలుగకుండా ఉండేలా తమ వాదనను సర్కారుకు వెల్లడించనున్నట్టుగా తెలిపారు.