Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల్లో (ఎన్బీఎఫ్సీ) కొనసాగుతున్న సంక్షోభ పరిస్థికనబరిచే అవకాశం ఉందని గ్లోబతులు.. రానున్న రోజుల్లో బ్యాంకింగ్ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని ల్ రేటింగ్ సంస్థ ఫిచ్ అభిప్రాయపడింది. ఎన్బీఎఫ్సీ రంగంలో దైహిక సంక్షోభం మొదలైన నేపథ్యంలో.. బ్యాంకులకు దాదాపు రూ.3.5 లక్షల కోట్ల మేర మూలధన లోటు ఏర్పడే అవకాశం ఉందని ఫిచ్ వెల్లడించింది. ఈ కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల క్రెడిట్ ప్రొఫైల్ గణనీయంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని తెలిపింది. అధిక సాల్వెన్సీ నష్టాల కారణంగా బ్యాంకులు ప్రభుత్వం నుంచి మూలధన సహాయం అందకుంటే పని చేయలేని స్థితికి కొన్ని బ్యాంకులు దిగజారే అవకాశం ఉందని తెలిపింది. బ్యాంకులు ఎన్బీఎఫ్సీ సంస్థలకు అందించిన రుణాల్లో దాదాపు 30 శాతం వరకు రుణాలు నిరర్థక ఆస్తులుగా మారే అవకాశం ఉందని ఫిచ్ అంచనా కట్టింది. నగదు లభ్యత కఠినతరం కావడంతో పాటు.. బలహీనమైన రుణ వితరణ వల్ల బ్యాంకుల ఆస్తులు దాదాఉ 30 శాతం వరకు నిరర్థక ఆస్తులుగా మారే అవకాశం ఉన్నట్టుగా రేటింగ్ సంస్థ తెలిపింది. దేశంలో ఆస్తుల అభివృద్ధి రంగం ఎక్కువగా ఎన్బీఎఫ్సీ సంస్థలపై ఆధారపడుతూ వస్తోందని.. బ్యాంకింగేతర విత్త సంస్థల్లో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఫిచ్ తెలిపింది. ఫలితంగా బ్యాంకులు తమ నిరర్థక ఆస్తులను తగ్గించుకొనేందుకు తీసుకున్న చర్యలతో కనిపించిన పురోగతి కాస్త కొట్టుకుపోయే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఎన్బీఎఫ్సీ సంస్థల వైఫల్యాల కారణంగా రానున్న రోజుల్లో బ్యాంకుల నిర్థక ఆస్తుల ఎన్పీఏ నిష్పత్తి 9.3 శాతం నుంచి 2020-21 నాటికి 11.6 శాతానికి చేరుకునే అవకాశం ఉందని తాజాగా ఒక అధ్యయనంలో తేలింది. బలహీనమైన ఆర్థిక వాతావరణం, క్రెడిట్ వ్యయం పెరిగిపోయిన కారణంగా రానున్న రెండేండ్లలో గణనీయమైన నష్టాలు వచ్చే అవకాశం ఉందని ఫిచ్ అభిప్రాయపడింది.