Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి ఎస్సీ గార్గ్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: సరిగ్గా మూడేండ్ల కిందట ప్రధాని మోడీ దేశంలో సగానికిపైగా చెలామణిలోఉన్న పెద్ద నోట్లను రద్దు చేసి దేశ జనాన్ని నిద్రలేకుండా చేశారు. బ్యాంకుల ముందు భారీ క్యూలు..వృద్ధులు, సామాన్య జనం ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఆ పీడకలను మరవక ముందే... తాజా గా ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఎస్.సి.గార్గ్ నోట్ల రద్దుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దుకు మూడేండ్లు పూర్తయిన సందర్భంగా రూ. 2వేల నోటును కూడా రద్దు చేయాలని గార్డ్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రూ. 2వేల నోటు రద్దుపై సర్వత్రా అనుమానాల..ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు షాకిస్తు న్నాయి. ద్రవ్య చెలామణిలో పెద్దదైన రూ.2వేల నోటును రద్దు చేస్తారా..? అలాంటి నిర్ణయం మోడీ సర్కార్ తీసుకుంటుందా..అనే చర్చ షురూ అయింది.
పెద్ద నోటుపై రచ్చ
నవంబర్ 8, 2016 న నోట్లరద్దు నిర్ణయం ప్రకటించాక.. ప్రవేశపెట్టిన కొత్త రూ .2,000 నోట్లు ప్రధానంగా ఉన్నాయనీ ఇపుడు వీటిని అక్రమ టెండర్గా ప్రకటించవచ్చని సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు. రూ. 2 వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకోవడం వల్ల ఎలాంటి అంతరాయం కలగదని ఆయన వాదన. పెద్ద నోట్ల స్థానంలో తెచ్చిన రూ.2000 నోటును కూడా ఇప్పుడు రద్దు చేయాల్సిన అవసరం ఉందని ఆయ న అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్ల విలువలో మూడో వంతు రూ.2000 నోట్లే ఉన్నప్పటికీ వీటిలో చాలా వరకు చెలామణిలోకి రావడం లేదు. అయితే ఈ డబ్బు ఎవరివద్ద ఉన్నది. పెద్ద నోట్లు ఎక్కువగా సంపన్నుల వద్ద ఉన్నట్టు అంచనా. ఏటీఎంలలోనూ 2000 నోట్లను పెట్టకపోవటంతో పలు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. నోట్ల రద్దు వల్ల ఉగ్రవాద చర్యలు, నకిలీ కరెన్సీ తయారు అసాధ్యమని మోడీ సర్కార్ ప్రకటించింది. కానీ ఇటీవల ఖమ్మంలో 2000 నకిలీ నోట్లు భారీగా పట్టుబడిన విషయం విదితమే.