Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్లో మరో కలకలం రేగింది. సంస్థలో అనైతిక ఆర్థిక పద్ధతులు అమలవు తున్నా యంటూ ప్రజావేగు లేఖ గత నెల 20న వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై విచారణ సాగుతున్న తరుణంలోనే మళ్లీ ఇలాంటి ఫిర్యాదు సంస్థకు అందించింది. విజిల్ బ్లోయర్లు రేపిన సెగ ఇంకా చల్లారకముందే, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్పై మరో విజిల్ బ్లోయర్ సంచలన ఆరోపణలు చేశారు. పరేఖ్కు రెండు నెలల గడువు ఇచ్చినప్పటికీ కేవలం తన వ్యాపార ప్రయోజనాలకోసమే బెంగళూరుకు మకాం మార్చకుండా, ముంబైలోనే ఉంటున్నారని ఆరోపించారు. సీఈవోకు స్టాక్ మార్కెట్ కనెక్షన్లు ఉన్నాయని, అనేక సంస్థలలో పెట్టుబడులు పెట్టారని ఆరోపించిన ఫిర్యాదుదారుడు, పరేఖ్ తన పెట్టుబడుల పర్యవేక్షణ కోసమే ఇదంతా చేస్తున్నారన్నారు. దీన్ని ఆదర్శంగా తీసుకున్న చాలామంది ఉద్యోగులు ఇంటి నుండి పనిచేయడం ప్రారంభించారన్నారు. సీఈవో నెలకు రెండు సార్లు ఆఫీస్కు వచ్చేందుకు విమాన చార్జీలు, ఇతర రవాణా చార్జీలకే సంస్థ రూ. 22 లక్షలు చెల్లించినట్టు తెలిపారు. నెలకు నాలుగు బిజినెస్ క్లాస్ విమాన టిక్కెట్లు, ఇంటికి నుంచి ముంబయి, బెంగళూరు విమానాశ్రయాలకి, ఆఫీసు నుంచి విమానాశ్రయం చార్జీలు ఇందులో ఉన్నాయని విజిల్ బ్లోయర్ ఆరోపించారు. అంతేకాదు సలీల్పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఇన్ఫీ చైర్మన్ నందన్ నీలేకనితో పాటు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కు ఒక లేఖ రాశారు. 11 బిలియన్ డాలర్ల కంపెనీ ఫైనాన్స్ విభాగ ఉద్యోగిని అని చెప్పుకున్న విజిల్బ్లోయర్, పరేఖ్ అక్రమాలను బహిర్గతం చేసినందుకు తనపై ప్రతీకారం తీర్చుకుంటారనే భయంతో తన గుర్తింపును వెల్లడించలేక పోతున్నానంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగిగా, వాటాదారుగా, సంస్థ విలువ వ్యవస్థలను క్షీణింపజేస్తున్న పరేఖ్ గురించి కొన్ని వాస్తవాలను చైౖర్మన్, బోర్డు దృష్టికి తీసుకు రావడం తన కర్తవ్యంగా భావిస్తున్నానని చెప్పారు. తక్షణమే స్పందిం చి, సంస్థ భవిష్యత్తు కనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరారు.