Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరుసగా మూడో నెలా తగ్గిన వాడకం
- అక్టోబరులో 13.24 శాతం మేర క్షీణత
- పుష్కర కాలంలో ఎన్నడూ లేని విధంగా తగ్గుదల
- మందగమనానికి ప్రతిరూపం: నిపుణులు
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనం పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ వినియోగం అంతకంతకు పడిపోతూ వస్తోంది. తాజాగా గత అక్టోబరు మాసంలోనూ దేశ విద్యుత్తు డిమాండ్ 13.2 శాతం పడిపోయి సర్కారును కలవర పెడుతోంది. విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే ఎక్కువ పారశ్రామిక రాష్ట్రాలై మహారాష్ట్ర, గుజరాత్లలో వాడకం గణనీయంగా పడిపో వడంతో అక్టోబరు మాసంలో విద్యుత్తు డిమాండ్ 98 బిలియన్ యూనిట్లకు పరిమితమైంది. అంతకు ముందు ఏడాది ఇదే సమయంలో వినియోగం 113 బిలియన్ యూనిట్లుగా నిలిచిందనిసెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తెలిపింది. విద్యుత్తు డిమాండ్ పడిపోవడం ఇది వరుసగా మూడో నెల అని సీఈఏ వివరించింది. దేశంలో రుతుపవనాలు ఆలస్యంగా విస్తరించడంతో పాటు వాతావరణం చల్లగా మారడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవంగా విశ్లేషించి చూస్తే దేశంలో నెలకొన్న మందగమనం వల్ల పారిశ్రామికోత్పత్తి మందగించడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. అక్టోబరులో విద్యుత్ డిమాండ్ 12 ఏండ్ల కాలం లో ఎన్నడూ లేని విధంగా వేగంగా పడిపోవడం ఇదే తొలిసారిన సీఈఏ లెక్కలు చెబుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ ముందుకు నడిచేందుకు విద్యుత్ ప్రధాన ఇంధనంగా ఆర్థిక పండితులు చెబుతుంటారు. అలాంటిది ఇప్పుడు విద్యుత్ ని యోగం తగ్గిందంటే ఆర్థిక వ్యవస్థ పరుగు మందగించిందని నేరుగానే విశ్లేషించ వచ్చని వారు చెబుతున్నారు.
గతానికి భిన్నంగా డిమాండ్ తగ్గుదల..
దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా పరిస్థితులను విశ్లేషించి చూస్తే సెప్టెంబరు- అక్టోబరు మాసంలో విద్యుత్ మాండ్ పెరుగుతూ వస్తోంది. కానీ ఈ ఏడాది పరిస్థితిని గతంతో పోల్చి చూస్తే డిమాండ్లో అనూహ్య తగ్గుదల కని పించడం ఆందోళనకరమని విద్యుత్ రంగ నిపుణులు చెబుబుతున్నారు. సీఈఏ సమాచారాన్ని విశ్లేషించి చూస్తే పీక్ అవర్ పవర్ డిమాండ్ ఏడాది ప్రాతిపదికన విశ్లేషించి చూస్తే 5 శాతం మేర పడిపోయి 165 గిగావాట్స్కు పడిపోయింది. ఇక దేశంలో అత్యధికంగా డిమాండ్ పడిపోయిన రాష్ట్రాల జాబితాలో మధ్య ప్రదేశ్ (26%), కర్నాటక (25%), మహారాష్ట్ర (22%), గుజరాత్ (19%), ఆంధ్రప్రదేశ్ (16%), తెలంగాణలో (16%) రాష్ట్రాలు ఉన్నాయి.
లబోదిబోమంటున్న ఉత్పత్తిదారులు
విద్యుత్ డిమాండ్ తగ్గి ఉత్పత్తి చేస్తున్న కరెంటును వినియోగదారులైన కంపెనీలు కొనుగోలు చేయకపోవడంతో పవర్ డిస్కం సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయి. ప్లాంటుల నిర్వహణకు అవుతున్న ఖర్చుకు.. వస్తున్న ఆదాయానికి మధ్య అంతరం అంతకంతకు పెరుగుతూ వస్తోందని దీంతో తాము నష్టాల్లోకి జారుకోవాల్సి వస్తోందని ఆయా సంస్థలు గగ్గొలు పెడుతున్నాయి. ఇప్పటికే విద్యుత్ రంగంలోని పలు ప్లాంటులు సకాలంలో రుణాలను చెల్లించలేక తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయని..
దీనికి తోడు ఇప్పుడు డిమాండ్ మరింతగా పడిపోయి ఆదాయం తగ్గుతుండడంతో పరిశ్రమ వర్గాలలో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని విద్యుదుత్పత్తి సంఘం డైరెక్టర్ జనరల్ అశోక్ ఖురానా తెలిపారు. డిమాండ్ తగ్గి డిస్కంలు సకాలంలో బకాయిలను చెల్లించకపోవడం, ఇంధన బకాయిలు, ఆర్థిక సమస్యలు, నియంత్రణ సంస్థల అనుమతులలో జాప్యం పరిశ్రమను పట్టిపీడిస్తున్నాయని.. దీనికి తోడు ఇప్పుడు డిమాండ్ పడిపోవడం కూడా తమకు కొత్త తలనొప్పిగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్తు ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం రూ.61,144 కోట్ల నుంచి రూ.80,260 కోట్లకు చేరుకున్నాయి.