Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్: సోషల్ మెసేజింగ్ వేదిక ఫేస్బుక్ డిజిటల్ పేమెంట్ రంగంలోకి అడుగు పెట్టింది. 'ఫేస్బుక్ పే' పేరుతో ఈ సేవలను అమెరికాలో ప్రారంభించింది. 'ఫేస్బుక్ పే' ద్వారా దాదాపు అన్ని క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు పేపాల్ ద్వారా చెల్లింపులను చేసుకోచ్చని సంస్థ తెలిపింది. ఈవెంట్ టిక్కెట్లు, ఇతర కొనుగోళ్లతోపాటు, వ్యక్తుల మధ్య నగదు లావాదేవీలు కూడా ఈ వేదిక ద్వారా చేసుకోవచ్చని ఫేస్బుక్ ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి తోడు అమెరికాలో వచ్చే వారం నుంచి మెసేంజర్, ఫేస్బుక్ మార్కెట్ప్లేస్లో వివిధ బిజినెస్ల కొనుగోళ్లు చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఈ విధానంలో వినియోగదారులు డబ్బు పంపేటప్పుడు లేదా చెల్లింపు చేసేటప్పుడు అదనపు భద్రత కోసం పిన్ నెంబర్, టచ్ లేదా ఫేస్ ఐడి గుర్తింపు లాంటి బయోమెట్రిక్ ఆప్షన్లను ఇందులో ఏర్పాటు చేశారు. ఫేస్బుక్ గూటికే చెందిన వాట్సాప్, మెసెంజర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా డిజిటల్ లావాదేవీల సౌలభ్యాన్ని త్వరలోనే తాము వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నట్టుగా సంస్థ తెలిపింది. కాలక్రమేణా ఎక్కువ మందికి, ఎక్కువ ప్రదేశాలకు తీసుకురావాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ అండ్ కామర్స్ విభాగం ఉపాధ్యక్షుడు ప్రెసిడెంట్ డెబోరా లియు తెలిపారు. మెసెంజర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో పనిచేసే కొత్త చెల్లింపుల వ్యవస్థ ను త్వరలోనే తీసుకురానున్నామని ఆయన వివరించారు. అమెరికా తరువాత భారతదేశంలో ఫేస్బుక్, వాట్సాప్ పే, పీర్-టు-పీర్ చెల్లింపు వ్యవస్థను ప్రారంభించేందుకు ఇప్పటికే నిర్మాణాత్మక చర్యలను ప్రారంభించినట్టుగా సంస్థ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.