Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ భారత్ జీడీపీ వృద్ధిరేటును తగ్గించింది. 2019 లో 7.4శాతం వ ద్ధిరేటు సాధించవచ్చని వేసిన అంచనాల్లో మార్పులు చేసింది. తాజా పరిస్థితులను బట్టి వృద్ధిరేటు 5.6శాతం మాత్రం ఉండవచ్చని పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు వినిమయ డిమాండ్ను ఏ మాత్రం పెంచలేవని పేర్కొంది. ''భారత జీడీపీ వృద్ధిరేటు అంచనాల్లో మార్పులు చేస్తున్నాం. భారత్లో జీడీపీ వేగం తగ్గుతుందని అంచనావేస్తున్నాం. ఇది 2019లో 5.6శాతం ఉండవచ్చు. 2018లో 7.4శాతంగా వేసిన అంచనాల్లో మార్పులు చేస్తున్నాం. భారత ఆర్థిక మందగమనం అనుకున్న దానికన్నా ఎక్కువ రోజులు ఉండనుంది. ప్రభుత్వ తీసుకొన్న చర్యల్లో ఏవీ బలహీనంగా ఉన్న డిమాండ్పై ప్రభావం చూపేవి కాదు. డిమాండే ఆర్థిక వ్యవస్థకు కీలక చోదక శక్తి'' అని మూడీస్ పేర్కొంది. ఇప్పటికే అక్టోబరు 10న మూడీస్ భారత ఆర్థిక వృద్ధిరేటును 6.2శాతం నుంచి తగ్గించి 5.8శాతానికి చేర్చింది. భారత ఆర్థిక వ్యవస్థ రేటింగ్ను మూడీస్ తగ్గించింది. 'స్థిరం' నుంచి 'ప్రతికూలం' రేటింగ్ను ఇచ్చింది. ముఖ్యం దేశ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక ఒత్తిడి తీవ్రంగా ఉండటంతో ఇది వృద్ధిరేటుపై పడుతోందని అభిప్రాయపడింది. ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక వృద్ధిరేటు తగ్గకుండా చాలా చర్యలు తీసుకొంది. సెప్టెంబర్ నెలలో కార్పొరేట్ పన్నులను గణనీయంగా తగ్గించింది. గతంలో 30శాతం ఉన్న కార్పొరేట్ పన్నును 22శాతానికి చేర్చింది. దీంతోపాటు మరిన్ని తాయిలాను ప్రకటించింది. బ్యాంకులకు మూలధనం సమకూర్చడం, ఆటోమొబైల్ పరిశ్రమకు రాయితీలను ప్రకటించింది. అయినా లాభం లేదని మూడీస్ తెలిపింది.