Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ తమ బైకుల ధరలను పెంచింది. ఆగస్టులో ప్రవేశపెట్టిన 'బుల్లెట్ 350' కొత్త మోడళ్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బుల్లెట్ 350(కిక్ స్టార్ట్) ధరను రూ.2,755, బుల్లెట్ 350 (ఎలక్ట్రిక్ స్టార్ట్) ధర రూ.4,365 మేరకు పెంచుతున్నట్టుగా సంస్థ తెలిపింది. ధర పెరుగుదలకు ముందు కిక్స్టార్ మోడల్ ధర రూ.1,12,000, ఎలక్ట్రిక్ స్టార్ట్ ధర రూ.1,26,000గా ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 మోడల్లో సింగిల్ ఛానల్ ఏబీఎస్, 280 ఎంఎం ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 346 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ను అమర్చారు. ఈ బైక్ 19.8 బీహెచ్పీ శక్తిని, 4,000 ఆర్పీఎం వద్ద 28 ఎన్ఎం టార్క్ను విడుదల చేస్తుంది. బుల్లెట్లో అత్యంత చౌక మోడల్ను గత ఆగస్టులో విడుదల చేసింది. ఇటీవల పండుగ సీజన్లో విక్రయాలు పుంజుకొన్నాయి. దీంతో స్వల్పంగా ధరలను పెంచాలని ఎన్ఫీల్డ్ నిర్ణయించింది. అయితే స్వల్ప ధరల పెంపు వల్ల తమ డిమాండ్ పెద్దగా ప్రభావితంకాకపోవచ్చని సంస్థ దీమా వ్యక్తం చేస్తోంది.