Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: జర్మనీకి చెందిన హఫెలె సంస్థ హైదరాబాద్లో తన అతిపెద్ద డిజైన్ సెంటర్ను ప్రారంభించింది. దాదాపు 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సంస్థ దీనిని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హఫెలె దక్షిణాసియా, భారత విభాగం ఎండీ జర్గన్ ఓల్ఫ్ మాట్లాడుతూ తమ సంస్థ భారత్లోని అన్ని రాష్ట్రాలకు తన విస్తృతిని విస్తరించుకుంటూ ముందుకు సాగుతోందని అన్నారు. వినూత్నమైన ప్రపంచ స్థాయి ఇన్నోవేటివ్ స్మార్ట్సొల్యూషన్స్ను అందించే విషయంలో తమ సంస్థ ముందుంటోందని అన్నారు. 2011 నుంచి తమ కంపెనీ సగటున 30 శాతం వృద్ధితో ముందుకు సాగుతోందని అన్నారు. ప్రస్తుతం సంస్థ రూ.800 కోట్ల ఆదాయానికి చేరువైందని తెలిపారు. వచ్చే ఏడాదికి రూ.1000 కోట్ల రెవెన్యూను అందుకొనే స్థాయికి చేరువ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా ఆయన వివరించారు. హఫెలె గ్లోబల్కు చెందిన అనుబంధ సంస్థగా హఫెలె ఇండియా మెరుగైన పనితీరును కనబరుస్తోందని అన్నారు. మాతృ సంస్థకు చెందిన ప్రధాన ఆదాయంలో దాదాపు 80 శాతం భారత్తో సహా వివిధ దేశాలలోని అనుబంధ సంస్థల కార్యకలాపాల నుంచే లభిస్తున్నట్టు ఆయన వివరించారు.