Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ప్రయివేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుం ది. మార్కెట్ మూలధన విలువ పరంగా (మార్కెట్ క్యాప్) హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దేశంలోనే మూడో అతిపెద్ద సంస్థగా నిలిచి తన సత్తా చాటింది. దీంతో రిలయన్స్ ఇండిస్టీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి దిగ్గజ కంపెనీల సరసన హెచ్డీఎ ఫ్సీ సంస్థ చోటు దక్కించుకున్నట్టయింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాప్ తాజాగా రూ.7 లక్షల కోట్ల మార్క్ను అధిగమించింది. దీంతో దేశంలో ఈ మార్క్ను అందుకున్న మూడో సంస్థగా రికార్డు కెక్కింది. అంతేకాదు.. ఈ ఘనత సాధించిన తొలి బ్యాంకుగా కూడా రికార్డును నమోదు చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ఇంతవరకు మరే ఇతర బ్యాంక్ కూడా ఈ మార్క్ను అందుకోలేకపోయాయి. రిలయన్స్ ఇండిస్టీస్ (ఆర్ఐఎల్), టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) మాత్రమే రూ.7 లక్షల కోట్ల మైలురాయిని అందుకున్నాయి. రిలయన్స్ ఇండిస్టీస్ ఇప్పుడు ఏకంగా రూ.9.38 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్తో దేశంలో అగ్రస్థానంలో దూసుకెళ్తోంది. దీని తర్వాతి స్థానంలో టీసీఎస్ ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.8.28 లక్షల కోట్ల దరిదాపుల్లో ఉంది. ఎస్ఎస్ఈలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాక్ ధరలు శుక్రవారం 0.31 శాతం పెరిగి రూ.1,277.9 వద్ద ముగిసింది. ఈ షేరు ధర ప్రాతిపదికన చూస్తే.. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,03,071.27 కోట్లకు చేరువైందని మార్కెట్ విశ్లేషణలు చెబుతున్నాయి. బ్యాంక్ షేరు ఇంట్రాడేలో రూ.1,285 స్థాయికి కూడా తాకింది. ఇది 52 వారాల గరిష్ట స్థాయి కావడం గమనార్హం.