Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రభుత్వం వస్తుసేవల పన్ను (జీఎస్టీ) చెల్లింపుదారులకు స్వల్ప ఊరటను కలిగించింది. జీఎస్టీఆర్-9 (వా ర్షిక రిటర్న్), జీఎస్టీఆర్-9సీ (రీకన్సిలేషన్ స్టేట్మెంట్) సమ ర్పణకు గడువు పొడిగింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫారముల దాఖలు కు గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గడువును 2020 మార్చి 31 వరకు ఎక్స్టెండ్ చేసింది. గతంలో జీఎస్టీఆర్-9, జీఎస్టీఆర్-9సీ ఫైలింగ్కు గడువు తేదీ ఇది వరకు 2017-18 ఆర్థిక సంవత్సరానికి నవంబర్ 30గా ఉంది. అలాగే 2018-19 ఆర్థిక సంవత్సరానికి డెడ్లైన్ 31 గా ఉండేది. ఇప్పుడు దీన్ని పొడిగించారు. జీఎస్టీ చెల్లింపుల వ్యవస్తను మరింత సులభతరం చేస్తామని ప్రకటించినట్టు గానే సర్కారు ఆయా ఫారము లలో పలు కాలమ్స్ను తొలగిం చింది. మరికొన్నింటిని ఆప్షనల్గా కూడా మార్చేసింది. దీంతో ఇకపై సులభంగా జీఎస్టీ రిటర్న్స్ను దాఖలు చేసేందుకు వీలుపడు తుందని సర్కారు వెల్లడించింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఈమేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా గడువు పొడిగింపు నేపథ్యంలో జీఎస్టీ చెల్లింపుదారులు అందరూ నిర్దేశిత గడువులోగా రిటర్న్స్ను దాఖలు చేస్తారని సీబీఐసీ ఆశాభావం వ్యక్తం చేసింది. 'రిటర్న్స్ దాఖలు సరళతరం చేశాం, గడువు పొడిగింపు ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. అయితే గడువు పలు మార్లు పొడిగించుకుంటూ వెలితే వ్యాపారాలపై ప్రభావం పడొచ్చు' అని క్లియర్ ట్యాక్స్ సీఈవో అర్చిత్ గుప్తా తెలిపారు.