Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో వస్తు ఎగుమతులు వరుసగా మూడో నెలా పడిపోయింది. అక్టోబ రులో వస్తు ఎగుమతు లు ఏడాది ప్రాతిపదికన పోల్చి చూస్తే 1.11 శాతం మేర కుంగాయి. పెట్రోలియం ఉత్పత్తులు, లెదర్, రెడీమేడ్ వస్త్రాలు, కార్పెట్లుతో పాటు ప్రముఖంగా వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు అక్టోబరులో భారీగా పడిపోయాయి. దీంతో గత నెల ఎగుమతులు 26.38 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇదే సమయంలో దేశ దిగుమతులు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా 16.31 శాతం మేర పడిపోయి 37.39 బిలియన్లకు పరిమితమయ్యాయి. ఫలితంగా దేశ వాణిజ్య లోటు 11.01 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతకు ముందు అక్టోబరు మాసంలో ఇది 18 బిలియన్ డాలర్లుగా ఉంది. అక్టోబరు మాసంలో దేశ వాణిజ్య లోటు గణనీయంగా పెరిగినప్పటికీ లేబర్ ఆధారిత రంగాలైన రత్నాభరణాలు, జ్యువెల్లరీ, ఇంజినీరింగ్ వస్తువులు, రసాయనాలు, ఔషధాలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో స్వల్ప వృద్ధి కనబడినట్టుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తీవ్ర మందగమన పరిస్థితులు నెలకొన్న తరుణంగా ఈ రంగాల్లో కాస్త వృద్ధి కనిపించటం కొంత ఊరటనిచ్చే అంశమేనని వారు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఇది మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబరుతో ముగిసిన ఏడు నెలల కాలానికి విశ్లేషించి చూస్తే ఎగుమతుల 2.39 శాతం పడిపోయి 185.95 బిలియన్లకు కుంగాయి. ఇదే సమయంలో దేశ ఎగుమతులు 8.37 శాతం మేర పెరిగి 280.67 బిలియన్ డాలర్లకు చేరినట్టుగా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో దేశంలో వాణిజ్య లోటు 116.15 బిలియన్ డాలర్ల నుంచి 94.72 బిలియన్ డాలర్లకు చేరుకునట్టుగా సర్కారు లెక్కలు చెబుతున్నాయి. అయితే ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ మాత్రం దేశంలో వాణిజ్య లోటు ఆందోళనకర స్థాయిలోనే ఉందని అభిప్రాయపడుతోంది.