Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డైరెక్టరు హోదా నుంచీ బయటకు
ముంబయి: తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకు పోతున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) సంస్థ నుంచి డైరెక్టర్గా అనిల్ అంబానీ శనివారం వైదొలిగా రు. అనిల్ సహా నలుగురు డైరెక్టర్లు రాజీనామా చేశారు. దివాలా ప్రక్రియ కింద ఆస్తులు అమ్మకానికి ఉంచిన ఆర్కామ్ నుంచి అనిల్ అంబానీతో పాటు ఛాయా విరాని, రైనా కరానీ, మంజరి కకేర్, సురేష్ రంగాచా ర్లు డైరెక్టర్లుగా వైదొలిగారు. బీఎస్ఈకి ఇచ్చిన నోటీసులో ఈ మేరకు కంపెనీ పేర్కొంది. కాగా గతంలో కంపెనీ డైరెక్టర్, సీఎఫ్ఓ వీ మణికంఠన్ రాజీనామా చేశారని, వీరి రాజీనామాలను కంపెనీ రుణదాతల కమిటీకి నివేదిస్తామని ఆర్ కామ్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం బకాయిలకు కేటాయింపుల అనంతరం కంపెనీ నష్టాలు రూ.30, 142 కోట్లకు చేరిన నేపథ్యంలో అనిల్ డైరెక్టర్ పదవి నుంచి వైదొలగడం గమనార్హం. టెలికాం కంపెనీలు వరుసగా భారీ నష్టాలను ప్రకటిస్తుండటం ఈ రంగంల ప్రకంపనలు సృష్టిస్తోంది. లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం బకాయిలకు కేటాయిం పుల అనంతరం వొడాఫోన్ జులై-సెప్టెంబర్ కాలానికి రూ.50,921 కోట్ల నష్టాలు ప్రకటించగా, భారతీ ఎయిర్టెల్ రూ.23,000 కోట్ల నష్టాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే టెలికాం రంగంలోని మూడు ప్రధాన కంపెనీలైన వొడాఫోన్, భారతీ ఎయిర్టెల్, ఆర్కామ్ల మొత్తం నష్టం రూ.1,04,003 కోట్లకు చేరుకోవడం విశేషం. కంపెనీ దాదాపు పతనావస్థకు చేరుకున్న పరిస్థితుల్లో అనిల్ అంబానీ ఆర్కామ్కు గుడ్బై చెప్పడం పై సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. ఆయన ఈ పనిని గతంలోనే చేసి.. సమర్థమంతమన యాజమాన్యం చేతుల్లో సంస్థ నిర్వహణను ఉంచితే ఆర్కా మ్తో పాటు ఆ సంస్థను నమ్ముకొని పని చేస్తున్న కుటుంబాల వారికి అన్యాయం జరిగి ఉండేది కాదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆర్కామ్ సంస్థకు సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికి రూ.30,142 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ప్రస్తుతం దివాలా ప్రక్రియ నడుస్తున్న ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.1,141 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఏజీఆర ్(సవరించిన స్థూల రాబడి) విషయమై సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆర్కామ్ రూ.28,314 కోట్ల కేటాయింపులు జరపడంతో ఈ కంపెనీ నష్టాలు భారీగా పెరిగాయి.