Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎస్బీల్లో బలమైన కార్పొరేట్ పాలన అవసరం
- ప్రయివేటు రంగ విత్త సంస్థల్లో పాలన బాగుంది..
- ఎస్సీజీ లోపంతోనే ప్రభుత్వ బ్యాంకులు వెనుకంజ:ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వివాదాస్పదవ్యాఖ్యలు
అహ్మదాబాద్: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ (పీఎస్బీ) వ్యవస్థ పనితీరుపై భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) అధినేత శక్తికాంత దాస్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థలో కఠినమైన పాలనా విధానాలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు. దేశం లోని బ్యాంకింగ్ రంగాన్ని మరింత సమర్థమంతంగా తీర్చిది ద్దేందుకు గాను ప్రభుత్వ బ్యాంకుల్లో బలమైన కార్పొరేట్ పాలన (ఎస్సీజీ) ఎంతైనా అవసరమని ఆయన అన్నారు. కఠినమైన పాలన లేని కారణంగా అతిపెద్దదైన ప్రభుత్వ బ్యాంకింగ్ వ్యవస్థ పరిస్థితి 'గదిలో ఉండిపోయిన గజరా జులా' తయారైందని ఆయన అన్నారు. కఠినమైన పాలనా విధానాలు అమలులో లేని కారణంగానే దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మోసాలు, నిరర్థక ఆస్తుల స్థాయి పెరిగిపో తుండడం, మూలధన లేమి వంటి విపత్కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన అన్నారు. కఠినమైన విధానాలు లేని కారణంగా బ్యాంకుల్లో ఏవైనా అనుకోని పరి ణామాలు ఎదురైతే తట్టుకొనే స్థాయి కూడా ప్రభుత్వ రంగం లోని విత్త సంస్థలకు లేకుండా పోతోందని ఆయన అన్నారు. స్వతంత్ర బోర్డుల ద్వారా విత్త సంస్థల్లో సరైన నియంత్రణ, ఆడిట్, రిపోర్టింగ్, రిస్క్మేనేజ్మెంట్ వంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యతక తమ పరిశీలనకు వచ్చినట్టు గా ఆయన తెలిపారు. ఇది లోపించిన కారణంగానే చాలా విత్త సంస్థల్లోత నిరర్థక ఆస్తులు అంతకంతకు పడిపోతూ వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రయివేటులో ఎక్కువ నియంత్రణ
దేశంలోని బ్యాంకింగ్ పరిశ్రమలో దాదాపు 60 శాతం వాటా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆధీనంలోనే ఉందని ఆయన అన్నారు. ఆర్బీఐ ద్వారా వీటికి నియంత్రిత యజమానిగా ప్రభుత్వం వ్యవహరిస్తూ వస్తోందని అన్నారు. అయితే బ్యాంకులను నియంత్రించేందుకు గాను ఆర్బీఐ వద్ద కొన్ని అధికారాలు మాత్రమే ఉన్నాయని పెద్దబ్యాంక్ ఎప్పటినుంచో గగ్గొలు పెడుతున్న సంగతి తెలిసిందే. అదే ప్రయివేటు రంగ బ్యాంకులపై కఠినమైన నియంత్రణ విధానం యాజమాన్యం చేతుల్లో ఉందని దీని వల్ల ఆయా బ్యాంకులు మెరుగైన ఆర్థిక వృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నారని ఆర్బీఐ ఇప్పటికే పలు మార్లు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంక్లు తమ మార్కెట్ వాటాను కొల్పోవాల్సిన పరిస్థితి వస్తోందని పెద్దబ్యాంక్ ఇప్పటికే సర్కారుకు తెలిపిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్నిఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ తాజాగా మళ్లీ తెరపైకి తేవడంతో ఈదిశగా ఆర్థిక వ్యవస్థలో మళ్లీ చర్చ ప్రారంభమైంది.
భారత్లోనే అత్యధిక స్ట్రెస్డ్ అసెట్స్..
ప్రపంచ వ్యాప్తంగా పరిశీలించి చూస్తే భారత బ్యాంకింగ్ రంగంలోనే అత్యధికంగా స్ట్రెస్డ్ అసెట్స్ నమోదు అవుతూవస్తున్నట్టుగా బ్లూమ్బర్గ్ తాజాగా ఒక నివేదికలో తెలిపింది. విద్యుత్తు, ఉక్కు రంగంలోని పరిశ్రమలలో ఎక్కువగా స్రెస్డ్ అసెట్స్ నమోదవుతున్నట్టుగా ఈ నివేదిక తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే భారత్లో స్ట్రెస్డ్ అసెట్స్ నిష్పత్తి భారత్లోనే అత్యధికంగా భారత్లోనే నమోదవుతూ వస్తున్నాయని.. తాజా గణాంకాల ప్రకారం ఈ నిష్పత్తి 9.3 శాతానికి చేరుకున్నట్టుగా బ్లూమ్బర్గ్ తెలిపింది. భారత్ తరువాత ఇటలీ (8.5%), బ్రెజిల్లలో (3.1%) ఈ నిష్పత్తి అధికంగా ఉన్నట్టుగా ఈ నివేదిక తెలిపింది. ఇదే విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ తన ప్రసంగంలో ఉటంకించారు. అయితే నిరర్థక ఆస్తుల సమస్యను అధిగమించేందుకు గాను ఆర్బీఐ చేపట్టిన మొండి బకాయిల రిజర్వు పెంపు నిర్ణయం వల్ల మంచి ఫలితాలు వస్తున్నట్టుగా ఆయన తెలిపారు. ఈ నేపథ్యంయలో బ్యాంకింగ్ వ్యవస్థలో క్యాపిటల్ అడీక్వసీ రేషియో బాసిల్ ప్రమాణాలను మించి మెరుగైన స్థాయికి అభివృద్ధి చెందిందని అన్నారు.