Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మినిమం ఆపరేటింగ్ ప్రైస్ను ప్రవేశపెట్టాలి : సీఏఐటీ
న్యూఢిల్లీ : ఫ్లిప్కార్ట్, అమేజాన్ లాంటి ఈకామర్స్ వాణిజ్య సంస్థల డిస్కౌంట్లతో రిటైల్ అమ్మకాలు పడిపోయి వ్యాపారులు ఆందోళ టనపడుతున్నారు. ఇప్పటికే ఈకామర్స్ సంస్థలు, బ్రాండ్లు, బ్యాంకులన్నీ కలిసి ముంచేస్తున్నాయనీ రిటైల్ వ్యాపారులు రోడ్డుకెక్కుతున్నారు. అందుకే, ఆన్లైన్, ఆఫ్లైన్లలో ఒకే రకమైన డిస్కౌంట్లు ఉండేలా చూడాలనీ, అలాగే, ఉత్పత్తులపై ఎంఆర్పీ కాకుండా.. మినిమం ఆపరేటింగ్ ప్రైస్(ఎంఓపీ)ను ప్రవేశపెట్టాలని ఒక ట్రేడర్స్ బాడీ డిమాండ్ చేస్తున్నది. ఈ మేరకు కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స(సీఏఐటీ)ఓ లేఖలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూశ్ గోయల్కు విజ్ఞప్తి చేసింది. ఈ ఎంఓపీలోనే ల్యాండింగ్ ప్రైస్, నిర్వహణ ఖర్చు, చెప్పుకొదగిన లాభం ఇమిడి ఉంటుందని పేర్కొంది. అంతేకాదు, రిటైల్ వ్యాపారులను దృష్టిలో పెట్టుకుని ఈ ఎంఓపీ ధరకు తక్కువగా విక్రయాలు జరపకూడదన్న నిబంధననూ సూచించింది. ఈకామర్స్ సంస్థలకు, రిటైల్ వ్యాపారులకు మధ్య తలెత్తిన ధరల యుద్ధానికి ఫుల్స్టాప్ పెట్టే బాధ్యత బ్రాండ్ల(కంపెనీల)దేనని తెలిపింది. ఆన్లైన్, ఆఫ్లైన్లలో అమ్మకాలకు ఒకే రీతి డిస్కౌంట్లు, అలాగే, బ్యాంకులు అందించి క్రెడిట్ కార్డు ఆఫర్లూ ఒకే విధంగా వర్తింపజేయాలని విజ్ఞప్తి చేసింది.