Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ
ముంబయి : కేంద్ర సర్కారు వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో పలు రంగాలకు వ్యయం తగ్గించనున్నదని వార్తలు వస్తున్న నేపథ్యంలో దానికి తాను వ్యతిరేకమని నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ అన్నారు. ముంబయిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికే ద్రవ్యలోటు భారీగా పెరిగిపోయిందనీ, ఈ సమయంలో కుదింపు చర్యలు ఫలితాన్నివ్వబోవని అభిప్రాయ పడ్డారు. దీనికి తాను మద్దతివ్వబోనని తెలిపారు. కేంద్రం ఈసారి విద్యారంగానికి రూ. 3 వేల కోట్లు తగ్గించనున్నదనీ, అంతేగాక మొత్తంగా రూ. 2 లక్షల కోట్ల వ్యయాన్ని సైతం తగ్గించుకోవాలని చూస్తున్నదనే వార్తలు వస్తున్న తరుణంలో ఆయన స్పందిస్తూ... వాస్తవంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వాలు విద్యకు మొదటినుంచి తక్కువగానే వ్యయం చేస్తున్నాయని అన్నారు. దేశానికి ఉన్న వనరులతో విద్యారంగంలో మంచి ఫలితాలు సాధించవచ్చునని బెనర్జీ తెలిపారు.