Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ ఆర్థికవేత్త ఆర్.నాగరాజు
న్యూఢిల్లీ : వచ్చే ఐదేండ్లలో భారత్ ఐదు ట్రిలియన్ల (రూ. 375 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థను సాధించడం అసాధ్యమని ప్రముఖ ఆర్థిక నిపుణుడు ఆర్. నాగరాజ్ అన్నారు. ఆయన ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్లో ఆర్థిక శాస్త్రం విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. బడ్జెట్ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్లు చేరుకోవాలంటే 9 శాతం వృద్ధిరేటు సాధించాలని అన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని చేరుకోవడం అత్యంత కష్టంతో కూడుకున్న వ్యవహారమని చెప్పారు.