Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 7.35 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం
- కూరగాయలు 61శాతం వరకు ప్రియం
న్యూఢిల్లీ: దేశంలో ఆహారోత్పత్తుల ధరలు భగ్గుమంటున్నాయి. గత డిసెంబర్తో ముగిసిన నెలలో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణ సూచీ 7.35 శాతానికి ఎగిసింది. ఇది ఐదున్నరేండ్ల గరిష్ట కావడం విశేషం. ముఖ్యంగా కూరగాయలు, ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటడంతో రిటైల్ ధరలు ఎగిసిపడ్డాయి. జాతీయ గణంకాల కార్యాలయం(ఎన్ఎస్ఒ) సోమవారం వెల్లడించిన నివేదిక ప్రకారం కూరగాయల ధరలు భారీగా 60.5 శాతం పెరిగాయి. 2018 ఇదే డిసెంబర్ మాసంలో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ (సీసీఐ) 2.11 శాతంగా నమోదయ్యింది. క్రితం డిసెంబర్లో స్థూలంగా అహారోత్పత్తుల ధరలు 14.2 శాతం ప్రియమయ్యాయి. ఇంతక్రితం ఏడాది ఇదే నెలలో ఈ ద్రవ్యోల్బణం సూచీ -2.65 శాతంగా నమోదయ్యింది. 2019 నవంబర్ నెలలో అహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 10.01 శాతంగా ఉంది. ఇంతక్రితం రిటైల్ ద్రవ్యోల్బణం గరిష్టంగా 2014 జులైలో 7.39 శాతంగా చోటు చేసుకుంది. డిసెంబర్ మాసంలో పప్పులు 15.44 శాతం, మాంసం, చేపల ధరలు 10 శాతం చొప్పున ప్రియమయ్యాయి. దేశంలో ద్రవ్యోల్బణ సూచీని 4 శాతానికి పరిమితం చేసేలా చర్యలు చేపట్టాలని భారతీ రిజర్వు బ్యాంక్ ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పరిధినిమించి భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో వచ్చే ఫిబ్రవరిలో ఆర్బీఐ నిర్వహించనున్న ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్ల పెంపునకు అవకాశాలు లేకపోవచ్చని ఆయన విశ్లేషకులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణ కట్టడికి ఉన్న వడ్డీ రేట్లను తగ్గించాల్సిన పరిస్థితి నెలకొంది.