Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది మరీ తక్కువ
- జాడే కనిపించని 16 లక్షల సరికొత్త కొలువులు
- విత్త కష్టాలతో భారీగా తాత్కాలిక ఉద్యోగాలు 'కట్'
- వివిధ పేద రాష్ట్రాల నుంచి భారీగా పెరుగుతున్న వలసలు: ఎస్బీఐ 'ఎకోవ్రాప్'' నివేదిక
న్యూఢిల్లీ: మందగమన పరిస్థితులను ముందుగా అంచనా వేసి.. వాటి ప్రభావాలను నియంత్రించడంలో కేంద్రంలోని మోడీ సర్కారు పూర్తిగా విఫలమైంది. సరైన సమయంలో ప్రభుత్వం తగు చర్యలు చేపట్టకపోవడంతో దేశంలో ఆశించిన స్థాయిలో ఉద్యోగ కల్పన జరగడం లేదు. తాజాగా భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) వెల్లడించిన ''ఎకోవ్రాప్'' నివేదికలో ఈ విషయం మరోసారి నిరూపితమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాల కల్పన విషయాన్ని విశ్లేషిస్తే పలు ఆశ్చర్యకరమైన విషయాలు ఈ నివేదికలో వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అందుబాటులోకి వస్తాయని ముందుగా అంచనా కట్టిన ఉద్యోగాల కంటే కూడా దాదాపు 16 లక్షల కొత్త కోలువులు తక్కువగా నమోదు అయినట్టుగా ఈ నివేదిక తెలిపింది. అంతకు ముందు ఏడాది దాదాపు 89.70 లక్షల కొత్త కొలువులు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాదికి మొత్తంగా కనీసం 73.9 లక్షల కొత్త కొలువులు అందుబాటులోకి రావాల్సి ఉండగా.. ఈ ఏడాది ఏప్రిల్-అక్టోబరు మధ్య కాలంలో కొత్త ఉద్యోగుల సంఖ్య దాదాపు 43.1 లక్షలకు మాత్రమే పరిమితమైందని లెక్కలు చెబుతున్నాయి. ఈపీఎఫ్వోలో జరిగిన కొత్త ఉద్యోగుల వివరాల జోడింపును బట్టి ఈ నివేదికను ఎస్బీఐ వర్గాలు రూపొందించాయి. పేరోల్స్ నందు ప్రాథమికంగా రూ.15000లోపు జీతం పొందుతున్న ఉద్యోగులను ఈపీఎఫ్వో డేటాబేస్లో జోడిస్తూ వస్తుంటారు. ఈపీఎఫ్వో పరిధిలోకి రాని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కొన్ని రకాల ప్రయివేటు ఉద్యోగుల వివరాల నిమిత్తం ఎస్బీఐ నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్) డేటాను పరిగణనలోకి తీసుకుంది. ఎన్పీఎస్ ప్రకారం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కలిసి కొత్తగా అందుబాటులోకి తెచ్చిన లేదా తేనున్న కొలువుల సంఖ్యను మొత్తంగా విశ్లేషించి చూసినా కొత్త ఉద్యోగాలు మొత్తంగా దాదాపు 40,000 వరకు తక్కువగానే నమోదయ్యే అవకాశం కనిపిస్తోందని ఈ రిపోర్టు తెలిపింది.
భారీగా తాత్కాలిక ఉద్యోగుల తొలగింపు..
మందగమనం కారణంగా ఆయా సంస్థలు ఆర్థిక భారాల్లోకి కుంగిపోవడం, కొన్ని సంస్థలు దివాలా బాట పట్టడం తదితరాల కారణాల వల్ల దేశంలోని వివిధ రాష్ట్రాలలో తాత్కాలిక ఉద్యోగుల తొలగింపు వేగంగా సాగుతు న్నట్టు నివేదిక తెలిపింది. ము ఖ్యంగా అసొం, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి పలు రాష్ట్రాల లో సంస్థలు తమ వ్యాపారాలను కనిష్టీకరించుకోవడం కారణంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగింపు భారీగా సాగుతున్నట్టుగా ఈ నివేది కలో తేలింది. దీంతో ఉపాధి కోసం పేదలు, మధ్య తరగతి వారు పొట్ట చేతపట్టు కొని దేశ వ్యాప్తంగా వలస లు వెలుతున్నట్టుగా నివేదిక విశ్లేషించింది. అసమగ్రమైన వృద్ధి కారణంగా దేశం లో ఎక్కువగా వ్యవసాయ ఆధారిత, తక్కువ పారిశ్రామికీకరణ జరిగిన రాష్ట్రాల నుంచి ప్రజలు, చదువుకున్న వారు మెరుగ్గా అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు వలస పోవడం కనిపిస్తోందని నివేదిక వెల్లడించింది. ఎక్కువగా ఉత్తర ప్రదేశ్, బిహార్, దక్షిణ మధ్యప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్ల నుంచి ప్రజలు ఎక్కువగా పంజాబ్, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్రాలకు వలసపోతున్న ట్టుగా నివేదిక విశ్లేషించింది. ఉద్యోగ అవకాశా లు ఎక్కువగా ఉండడంతో ఎక్కువ మంది ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాలకు వలస రావడం కనిపిస్తోందని నివేదిక వెల్లడించింది. ఇలా వలస వచ్చిన పేదలు తమ అవసరాలను నియంత్రించుకుంటూనే పొదుపుకు ప్రాధాన్య తనిస్తున్నారని.. దీనికి తోడు కూడబెట్టిన సొమ్ములో అత్యధిక భాగాన్ని వారు తమ తమ స్వస్థలాలకు పంపడం లేదా.. ఆస్తులను కొనడానికి వెచ్చిస్తున్నట్టుగా నివేదిక తెలిపింది. గడిచిన అయి దేండ్ల కాలంలో దేశ ఉత్పాదక వృద్ధి 9.4 నుంచి 9.9 శాతం దరిదాపుల్లో నమోదు అవుతూ వస్తోందని.. ఇది తక్కువ వేతనాల పెరుగు దలకు నిదర్శనమని ఆయన నివేదిక వెల్లడించింది. తక్కువ వేతనాల కారణంగా కార్పొరేషన్లు, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాల వారు తమ ఆకస్మికంగా వచ్చే అవసరాల కోసం ఎక్కువగా రుణాల వైపు దృష్టి సారించే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది. ఈ తరహా రుణాలు పెరిగితే ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా విధానకర్తలు ఉత్పాదక వృద్ధిని పెంచే దిశగా దృష్టి సారించాలని ఈ నివేదిక హెచ్చరించింది.