Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: యెస్ బ్యాంక్ జనవరి 10న జరిగిన బ్యాంకు బోర్డు సమావేశంలో డెట్, ఈక్విటీల ద్వారా రూ.10వేల కోట్ల నిధులను సేకరణకు ఆమోదం తెలిపింది. అయినా ఈ అంశం యస్ బ్యాంకు షేర్లకు మద్దతును ఇవ్వలేక పోయింది. ఫలితంగా ఈ బ్యాంకు షేరు పతనం వరుసగా 3వ రోజూ కొనసాగింది. మంగళవారం మరో 8.50శాతం క్షీణించి మొత్తంగా 19శాతాన్ని నష్టపోయింది. తుదకు నిఫ్టీలో 8.31 శాతం కోల్పోయి రూ.38.60 వద్ద ముగిసింది. నిరర్థక ఆస్తులు గణనీయంగా పెరగడం, మూలధన నిధుల సమీకరణ అలసత్వం కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. ఫలితంగా షేరు గడచిన ఏడాది కాలంలో ఏకంగా 80శాతం నష్టాన్ని చవి చూసింది. ఇర్విన్ సింగ్ బ్రెయిచ్, ఎస్పీజీపీ ప్రతిపాదిత ఇన్వెస్ట్మెంట్ ఆఫర్తో కొనసాగకూడదని బోర్డు నిర్ణయించింది. ఇన్వెస్ట్మెంట్ సంస్థలు 1.2 బిలియన్ డాలర్ల ఆఫర్ల ప్రకటనతో ముందుకొచ్చిన తరుణంలో యెస్ బ్యాంకు 2 బిలియన్ డాలర్ల వరకు మూలధన నిధుల్ని సమీకరిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. గతవారం ట్రేడింగ్ చివరిరోజైన శుక్రవారం నాడు బ్యాంక్ బోర్డు స్వతంత్ర సభ్యుడు, ఉత్తమ్ రాజీనామా ప్రభావం చూపింది.