Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : దాదాపు రెండేండ్లుగా ఆర్థిక అగ్రరాజ్యాలు అమెరికా, చైనాల మధ్య సాగుతున్న వాణిజ్య సంక్షోభాన్ని పరిష్కరించుకునేందుకు అడుగులు పడుతున్నాయి. తాజాగా చైనా ''కరెన్సీ మ్యానిప్యూలేటర్'' (కృత్రిమ విలువ) అనే ముద్రను అమెరికా తొలగించింది. యువాన్ బలోపేతం అయిందని, చైనాను కరెన్సీ మ్యానిప్యూలేటర్గా పరిగణించడం లేదని అమెరికా ట్రెజరీ కాంగ్రెస్కు ఇచ్చిన సెమీ వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. గతేడాది ఆగస్టు నెలలో చైనా తన కరెన్సీని బలహీనపరుస్తూ నిర్ణయం తీసుకోవడంపై ట్రంప్ స్పందిస్తూ చైనా తమ వ్యాపారాలను, ఫ్యాక్టరీలను దోచుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇది దీర్ఘకాలిక ఆందోళనకు గురిచేస్తుందని పేర్కొన్నారు. ఇటీవల యువాన్ డాలర్కు 6.93 బలోపేతం అయిందని, ప్రస్తుతం వాణిజ్య ఒప్పందం కరెన్సీ సమస్యలను పరిష్కరిస్తుందని అమెరికా ట్రెజరీ పేర్కొంది. తెలిపింది. మార్కెట్ పోటీ ప్రయోజనాల కోసం కరెన్సీ మారకం రేటు లక్ష్యంగా చేసుకోకుండా ఉండేందుకు చైనా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసిందని ట్రెజరీ కార్యదర్శి స్టీవెన్ మ్నుచిన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సానుకూల వాతావరణం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.