Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) కొత్త డిప్యూటీ గవర్నర్గా ప్రముఖ ఆర్థికవేత్త మైఖేల్ దేబబ్రాత పాత్రా నియమితులయ్యారు. పాత్రా మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. తన పదవీకాలం ముగియడానికి ఆరు నెలల ముందే గతేడాది జులైలో అప్పటి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య తన పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఆర్బీఐలో కీలకమైన డిప్యూటీ గవర్నర్ పదవి ఖాళీగా ఉంటూ వస్తోంది. ఈ పదవికి సమర్థుడైన వారికోసం ఆర్బీఐ కసరత్తు చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. కాగా విశ్లేషకులు ఊహించినట్టుగానే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న మైఖేల్ పాత్రాను ఆర్బీఐలో నాలుగో డిప్యూటీ గవర్నర్గా నియమిస్తూ అపాయింట్మెంట్ క్యాబినెట్ కమిటీ నిర్ణయం తీసుకోవడం విశేషం. ద్రవ్యోల్బణ నియంత్రణ విషయంలో ప్రత్యేక అనుభవం ఉన్న పాత్రాను సర్కారు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఎంపిక చేయడంలో పలు వ్యూహాలు దాగి ఉన్నట్టుగా తెలుస్తోంది. దేశంలో ఇన్ఫ్లేషన్ ఇప్పటికే అయిదున్నరేండ్ల గరిష్టానికి చేరింది. దీనిని నియంత్రించేలా చర్యలు తీసుకోవాలంటే ఒక మరచి నిష్ణాతుడైన అధికారి ఆర్బీఐకి అవసరం. ఈ నేపథ్యంలోనే ఆయన ఎంపిక నాటకీయంగా జరిగినట్టుగా తెలుస్తోంది.