Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్క చార్జింగ్తో 95 కి.మీ. మైలేజీ
- ప్రారంభపు ధర లక్ష రూపాయలు
న్యూఢిల్లీ : బజాజ్ ఆటోమొబైల్స్ కంపెనీ తన నూతన చేతక్ విద్యుత్ స్కూటర్ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసిం ది. ఒకప్పుడు ఎంతో పాపు లర్ అయిన చేతక్ను మా ర్పులు చేసి ఆధునిక హం గులతో కొత్త ఎలక్ట్రిక్ చేతక్ (ఇ-చేతక్)ను సంస్థ ఆవిష్కరించింది. ఎక్స్ షోరూం వద్ద దీని ధరను రూ.లక్షగా కంపెనీ నిర్ణయించింది. ఈ స్కూట ర్కు ముందు భాగంలో డిస్క్ బ్రేక్తో తయారు చేసింది. ఎలక్ట్రిక్ చేతక్ను ఆకట్టుకునే రంగులు, డిజైన్తో తీర్చిదిద్దినట్టు ఆ కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్లో 3 కిలోవాట్ అవర్ల బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి ఐపీ 67 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ను అందిస్తున్నారు. అందువల్ల వర్షాకాలంలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ స్కూటర్పై ప్రయాణించవచ్చు. ఇక ఈ బ్యాటరీని ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే ఎకో మోడ్లో ఈ స్కూటర్పై 95 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని ఆ కంపెనీ తెలిపింది. అదే స్పోర్ట్స్ మోడ్లో అయితే 85 కిలోమీటర్ల మైలేజీ వస్తుందని పేర్కొంది.. ఈ స్కూటర్లో అందిస్తున్న బ్యాటరీ లైఫ్ 70వేల కిలోమీటర్లని బజాజ్ కంపెనీ తెలిపింది. ఈ బ్యాటరీ ఫుల్ చార్జ్ అయ్యేందుకు 5 గంటల సమయం పడుతుందని.. అయితే కేవలం 1 గంటలోనే 25 శాతం వరకు చార్జింగ్ అవడం దీని విశేషమని పేర్కొంది. ఇక ఏ స్కూటర్లో లేని విధంగా ఇ-చేతక్లో రివర్స్ గేర్ను అందిస్తున్నారు. ఈ స్కూటర్ను యాప్ ద్వారా స్మార్ట్ఫోన్కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్పై 3 ఏండ్ల వారంటీని ఇస్తున్నారు. 50వేల కిలోమీటర్ల వరకు వారంటీ వర్తిస్తుంది. ప్రతి 12వేల కిలోమీటర్లకు ఒకసారి లేదా ఏడాదికి ఒకసారి సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో స్కూటర్కు 3 ఉచిత సర్వీసులు ఇస్తున్నట్టు ఆ కంపెనీ తెలిపింది.