Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బ్యాంకింగ్ సేవల్ని మరింత విస్తరించాలని కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. అందులో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21) నాటికి దేశవ్యాప్తంగా 15వేల కొత్త శాఖల్ని ఏర్పాటు చేయాలని బ్యాంకులను కోరినట్టు తెలుస్తోంది. బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులో లేని గ్రామాల్లో ప్రతి 15 కిలోమీటర్ల పరిధిలో ఒక కొత్త బ్రాంచ్ను ఏర్పాటు చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఇప్పటికే ఏయే ప్రాంతాల్లో శాఖల్ని ఏర్పాటు చేయాలనే అంశంపై తుది జాబితాను రూపొందించి ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకులకు అందజేసింది. కొత్తగా ప్రారంభమయ్యే శాఖ కచ్చితంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించిన ప్రదేశంలోనే ఉండాలని నిర్ణయించినట్టు తెలిసింది.
కొత్తగా ఏర్పడే ఈ శాఖలు వారంలో కనీసం 4నుంచి 5రోజులు పనిదినాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ఓ అధికారి పేర్కొన్నారు. గతేడాది మార్చి 2019నాటికి ఆయా బ్యాంకులకు దేశవ్యాపంగా 1.20లక్షల బ్యాంకు శాఖలు పని చేస్తున్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 35,649 శాఖలు మాత్రమే ఉన్నాయి.