Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ మౌలిక వసతుల కంపెనీ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తన ఎయిర్పోర్టు వ్యాపారంలో 49 శాతం వాటాను విక్రయించనుంది. ఇందులో కొంత వాటాను టాటా గ్రూప్ కంపెనీ ఎంటిటి టీఆర్ఐఎల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్కు విక్రయించాలని నిర్ణయించింది. అనేక వ్యాపారాలు కలిగి ఉన్న జీఎంఆర్ గ్రూప్ ఎయిర్పోర్ట్ల విభాగంలో 44.44 శాతం వాటాను విక్రయిస్తున్నట్టు గతంలో ప్రకటించినప్పటికీ.. ఈ వాటా మొత్తాన్ని తాజాగా పెంచడం విశేషం. జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తమ లావాదేవీలను మరింత విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
ఇంకా ఈ ఒప్పందం రెగ్యులేటరీ నిబంధనలకు లోబడి ఉంటుందని పేర్కొంది. టీయుటీపీఎల్లో భాగమైన టాటా రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్షర్లో ఇందులో వల్కెరియో ఇన్వెస్ట్మెంట్, సోలిస్ కాపిటల్ (సింగపూర్) రెండు విదేశీ భాగస్వామ్య కంపెనీలు ఉన్నాయి. జీఎంఆర్ ఎయిర్పోర్ట్సు విభాగంలో టాటా గ్రూపు 20 శాతం, జీఐసీ 15 శాతం, ఎస్ఎస్జి 10 శాతం చొప్పున వాటాలను కొనుగోలు చేయనున్నాయి. ఈ ఒప్పంద విలువ రూ.18,000 కోట్లుగా ఉంది. ఈ ప్రకటనతో గురువారం బీఎస్ఇలో జిఎంఆర్ ఇన్ఫ్రా షేర్ విలువ 0.42 శాతం తగ్గి రూ.23.85 వద్ద ముగిసింది.