Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశీయ వ్యాపారుల ఖండన
న్యూఢిల్లీ : బహుళ జాతి ఇ-కామర్స్ కంపెనీ అమెజాన్ భారత్లోని చిన్న, మధ్య తరహా వ్యాపారాలను డిజిటలైజ్ చేసేందు కుగానూ ఇక్కడ రూ.7100 కోట్ల (1 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపింది. బుధవారం ఢిల్లీలో అమెజాన్ సీఇఓ జెఫ్ బెజోస్ మాట్లాడుతూ 2025 నాటికి 10 బిలియన్ డాలర్ల విలువైన 'మేకిన్ ఇండియా' ఉత్పత్తులను అమెజాన్ ఎగుమతి చేయాలని నిర్దేశించుకున్నామన్నారు. అమెజాన్ పెట్టు బడుల ప్రకటనను అఖిల భారత వర్తక, వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) తీవ్రంగా ఖండించింది. భారత్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమల్ని పూర్తిగా కొల్లగొట్టేందుకు అమెజాన్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. కేవలం వారి వ్యాపారాలు, లాభాల కోసమే తాజా పెట్టుబడుల నిర్ణయాన్ని ప్రకటించిందని విమ ర్శించారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ సంస్థలు భారీ డిస్కౌంట్ల పేరిట చిరు వ్యాపారుల ఉపాధిని దెబ్బతీస్తున్నాయని సీఏఐటీ ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.