Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : వరుసగా రెండో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలాడాయి. బడ్జెట్ నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహారించడంతో శుక్రవారం సూచీలు అద్యంతం ఒడిదుడుకులకు గురైయ్యాయి. తుదకు బిఎస్ఇ సెన్సెక్స్ స్వల్పంగా 13 పాయింట్లు పెరిగి 41,945కు చేరింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 3 పాయింట్ల స్వల్ప నష్టంతో 12,352 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 42,064 వద్ద గరిష్టాన్ని తాకగా.. 41,850 వద్ద కనిష్ట స్థాయిని నమోదు చేసింది. నిఫ్టీ 12,385-12,321 పాయింట్ల మధ్య కదలాడింది. సెన్సెక్స్-30లో 12 స్టాక్స్ ప్రతికూలతను ఎదుర్కొగా.. 18 సూచీలు లాభపడ్డాయి. నిఫ్టీలో ఫార్మా రంగం సూచీ అత్యధికంగా 1.73 శాతం లాభపడగా.. బ్యాంకింగ్ సూచీ 0.83 శాతం నష్టపోయింది. నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పిఐలు) రూ. 395 కోట్లు, దేశీ ఫండ్స్(బొఐఐలు) రూ. 185 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.