Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెజాన్ సీఈఒ జెఫ్ బెజోస్
న్యూఢిల్లీ : భారత్లో సుమారు పది లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్టు అమెజాన్ సీఈఒ జెఫ్ బెజోస్ తెలిపారు. 2025లోగా ఆ ఉద్యోగాలను ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. 2025కల్లా భారత్లో తయారైన వస్తూత్పత్తుల ఎగుమతి లక్ష్యాన్నీ నిర్దేశించుకున్నట్టు ఆయన తెలిపారు. దీనితో పాటు అదనంగా సుమారు 10 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్టు ఆయన చెప్పారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంతక్రితం రోజు రూ.7వేల కోట్ల పెట్టుబడులను ప్రకటించారు. కాగా దీనిపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ అమెజాన్ వ్యాపారంలో వస్తున్న నష్టాలను పూడ్చుకునేందుకు భారత్లో పెట్టుబడులు పెడుతున్నదనే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. జెఫ్ బెజోస్ శుక్రవారం ఉద్యోగాల ప్రకటన చేశారు. భారత్కు వచ్చిన ప్రతిసారీ.. ఆ దేశంపై ప్రేమ పెరుగుతోందని, భారతీయుల్లో ఉన్న తపన, ఉత్సాహం, పట్టుదల తనకు ఎప్పుడూ ప్రేరణగా నిలుస్తుందని బెజోస్ పేర్కొన్నారు. గత ఆరేండ్లుగా అమెజాన్ ఇండియాలో పెట్టుబడులు పెట్టడం ద్వారా 7 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని, ఇప్పుడు కల్పించబోయే 10 లక్షలు అదనమని బెజోస్ పేర్కొన్నారు.