Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్ఎస్ఎస్కు నమ్మకస్తుడు స్వపన్దాస్ గుప్తాకు పదవి
న్యూఢిల్లీ : ప్రముఖ బ్యాంకర్, 'బ్రిక్స్' బ్యాంక్ చైర్మెన్ కె.వి.కామత్ను కేంద్ర మంత్రిమండలిలోకి తీసుకోనున్నట్టు సమాచారం! త్వరలోనే ఆయనను ఆర్థికశాఖ సహాయమంత్రిగా తీసుకోబో తున్నారని ప్రధాని కార్యాలయంలోని ఉన్నతాధికారుల్ని ఊటంకిస్తూ వార్తలు వెలువడ్డాయి. ఆర్థికమందగమనం నేపథ్యంలో కార్పొరేట్ వర్గాలకు మేలు చేకూర్చే మరిన్ని నిర్ణయాలు చేయాలన్న ఉద్దేశంతో కామత్ను కీలకస్థానంలో నియమిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా నేతృత్వంలో ఇటీవల న్యూఢిల్లీలో ప్రీబడ్జెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశవిదేశాలకు చెందిన బడా కార్పొరేట్ ప్రముఖులు, వారి ప్రతినిధులతో ప్రధాని స్వయంగా మాట్లాడారు. వారి అభిలాష మేరకు విధానపరమైన నిర్ణయాల కోసం కామత్లాంటి వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్రధాని నిర్ణయించుకున్నారట. గతంలో ఆయన ప్రఖ్యాత ఐటీ సంస్థ ఇన్ఫోసిస్కు చైర్మెన్గా పనిచేశారు. ఐసీఐసీఐ బ్యాంకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మెన్, ఎండీ, సీఈఒగా కూడా ఆయన వ్యవహరించారు.
ఆర్ఎస్ఎస్ సన్నిహితుడికి చోటు
ఆర్ఎస్ఎస్కు అత్యంత నమ్మకస్తుడు, కరుడుగట్టిన హిందూత్వవాది అయిన బీజేపీ రాజ్యసభ ఎంపీ స్వపన్ దాస్గుప్తాకు కూడా మంత్రిమండలిలో చోటుదక్క నున్నదని తెలుస్తున్నది. గుప్తాకు మానవ వనరులశాఖ సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారని సమాచారం. వర్సిటీల్లో వరుసగా జరుగుతున్న నిరసనలు మోడీ సర్కార్కు పెద్ద సవాల్గా మారాయి. దీనిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టడానికే స్వపన్ దాస్గుప్తాను తీసుకొస్తున్నారని వార్తా కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు గతంలో రైల్వే, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన సురేశ్ ప్రభు తిరిగి మోడీ ప్రభుత్వంలోకి వచ్చే అవకాశాలున్నాయి.