Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెందిన మెన్స్వేర్ బ్రాండ్ 'ది హంబుల్కం' వస్త్ర ఉత్పత్తులు ఇ-కామర్స్ సంస్థ మింత్రాలో అందుబాటులోకి వచ్చాయి. ఇందుకోసం శనివారం ఇరు సంస్థలు హైదరాబాద్లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. తన బ్రాండ్ ప్రయాణంలో మింత్రాతో సహకారం ఓ ముఖ్యమైన అడుగు అని మహేష్ బాబు ఈ సందర్బంగా పేర్కొన్నారు. దీంతో తమ ఉత్పత్తులు దేశ వ్యాప్తంగా ఉన్న వస్త్రాభిమానులను చేరుకోవడంలో మార్గం మరింత సుగమం కానుందన్నారు. దేశంలో ద్వితీయ, తృతీయ శ్రేణీ నగరాలు, పట్టణాలల్లో సెలబ్రిటీలకు చెందిన బ్రాండ్లు అధికంగా విజయవంతం అయ్యాయని మింత్రా జబాంగ్ హెడ్ అమర్ నాగారం పేర్కొన్నారు. 'ది హంబుల్కం'తో జట్టు కట్టడం సంతోషంగా ఉందన్నారు.