Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ వేదిక అయిన ఫిప్త్ గేర్ వెంచర్స్(ఎఫ్జివిఎల్)ను మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) కంపెనీ కొనుగోలు చేయనుంది. ఎంఅండ్ఎం తన అనుబంధ సంస్థ అయిన మహీంద్ర ఫస్ట్ ఛాయిస్ వీల్స్ లిమిటెడ్(ఎంఎఫ్సిడబ్ల్యుఎల్) ఫిప్త్గేర్ వెంచర్స్ను రూ.30.45 కోట్లతో స్వాధీనం చేసుకోన్నట్లు వెల్లడించింది. డిజిటల్ ఆటోమోటివ్స్ను మరింత విస్తరించేందుకు ఎఫ్జీవీల్ను కొనుగోలు చేస్తున్నట్టు ఎంఅండ్ఎం శనివారం తెలిపింది. ఎఫ్జీవీఎల్ను 2020 మార్చి 31 నాటికి పూర్తి స్థాయిలో సొంతం చేసుకుంటామని కంపెనీ పేర్కొంది. ఇది కొత్త, పాత వాహనాల కొనుగోలు, విక్రయాలను నిర్వహిస్తూ ఈ-కామర్స్ మార్కెట్ ప్లాట్ఫాంగా పనిచేస్తోంది.