Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
టీఎస్జెన్కోలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నందుకు గుర్తింపుగా సీఎస్ఐ ఎస్ఐజీ ఈ-గవర్నెన్స్ అవార్డ్ ఆఫ్ ఎక్స్లెన్స్ లభించింది. భువనేశ్వర్లో జరిగిన కార్యక్రమంలో టీఎస్జెన్కో అధికారులు ఈ అవార్డును అందుకున్నారు. శనివారం వారు ఆ అవార్డుతో జెన్కో సీఎమ్డీ దేవులపల్లి ప్రభాకరరావును కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఐటీ విభాగం ఉద్యోగులను అభినందించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని పూర్తిస్థాయిలో వాడుకుంటూ, పారదర్శకంగా వ్యవహరిస్తున్నందునే ఈ అవార్డు లభించిందని ఈ సందర్భంగా ప్రభాకరరావు అన్నారు. ఉద్యోగులు విధినిర్వహణలో ఇదే తరహా నిబద్ధతను కొనసాగించాలని ఆయన అభిలషించారు.