Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆదాయపు బకాయిలు రూ.1.47 లక్షల కోట్లు చెల్లించేందుకు గాను తమకు మరికొంత సమయం ఇప్పించా ల్సిందిగా భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, టాటా సర్వీ సెస్తో పాటు పలు టెలికాం కంపెనీలు సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్ను గతంలో ఏ ధర్మాసనం విచారించిందో అదే మళ్లీ దీన్ని స్వీకరిస్తుందని సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే తెలిపారు. వచ్చే వారం దీన్ని విచారణ జరగనుంది. తమ పిటిషన్ను ఛాంబర్లో కాకుండా బహిరంగ విచారణ జరపాలని టెలికాం కంపెనీలు అభ్యర్థించాయి. దీనిపై నిర్ణయాన్ని కూడా గతంలో టెలికాం కంపెనీల పిటిషన్ విచారించిన ధర్మాసనమే తీసుకుంటుందని సీజేఐ వెల్లడించారు. ఏజీఆర్ ఇచ్చిన తీర్పును పున్ణసమీక్షించాలని కోరుతూ గతవారం టెలికాం కంపెనీలు సుప్రీంని ఆశ్రయించాయి. ఈ పిటిషన్ను జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఏస్ఏ నజీర్, జస్టిస్ ఎమ్ఆర్.షాలతో కూడిన బెంచ్ కొట్టేసింది. జనవరి 23 లోపు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు రూ.1.47లక్షల కోట్లను కేంద్రానికి చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. బకాయి చెల్లించేందుకు ఉన్న సమయం చాలా తక్కువ అని దాన్ని పొడిగించాలని టెలికాం సంస్థలు న్యాయస్థానాన్ని కోరాయి. టెలికం సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సుమారు రూ.92వేల కోట్ల మేర సవరించిన స్థూల ఆదాయం(ఏజీఆర్) వసూలు చేసేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే.