Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.2485 కోట్లకు కుదిరిన భారీ డీల్..!
న్యూఢిల్లీ : భారత్కు చెందిన ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఏకంగా అమెరికాకు చెందిన ఉబెర్ టెక్నాలజీస్కు చెందిన ఉబెర్ ఈట్స్ భారత విభాగాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ఆ రెండు సంస్థలు దాదాపు రూ.2500 కోట్ల విలువైన వ్యాపార ఒప్పందం చేసుకొన్నాయని సమాచారం. అందుకు ప్రతిగా ఉబెర్కు జొమాటోలో 10 శాతం వాటా లభించింది. దీంతో ఉబెర్ ఈట్స్ జొమాటోతో విలీనంమైంది. అదే విధంగా ఉబెర్ ఈట్స్ వినియోగదారులందరినీ జొమాటోకు బదలాయించారు. జనవరి 21 నుంచి ఉబెర్ ఈట్స్ తన కార్యకలాపాలను నిలిపివేసిందని, ఆ సంస్థ ఖాతాదారులందరూ జొమాటోకి బదిలీ అయ్యారని జొమాటో వ్యవస్థాపకులు దీపిందర్ గోయల్ తన బ్లాగ్ పోస్ట్లో పేర్కొన్నారు. ఫుడ్ డెలివరీ వ్యాపారంలో దేశవ్యాప్తంగా 500 నగరాల్లో విస్తరించామని చెప్పడానికి ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ ఒప్పందంతో మా వ్యాపారం మరింత వద్ధిలోకి వస్తుందని ఆకాంక్షించారు. కాగా ఈ ఒప్పందంపై ఉబెర్ ఈట్స్ స్పందిస్తూ ఇంతకాలం ఉబెర్ ఈట్స్ను ఆదరించిన తమ కస్టమర్లందరూ ఇక నుంచి జొమాటోలో మరిన్ని ఎక్సైటింగ్ ఆఫర్లతో ఫుడ్ను ఎంజారు చేస్తారని పేర్కొంది. అయితే ఉబెర్ ఈట్స్ ఉద్యోగులను మాత్రం స్వీకరించడానికి ఆసక్తిగా లేదని సమాచారం. భారత్లో పనిచేస్తున్న 100 మంది ఎగ్జిక్యూటివ్లకు పదవీ విరమణ ఇవ్వడంగానీ, లేదా వేరే విభాగాలకు మళ్లించనున్నారు.