Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ శాంసంగ్ ''గెలాక్సీ నోట్ 10లైట్'' ఫోన్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గతేడాది విడుదల చేసిన గెలాక్సీ నోట్ 10 కొనసాగింపుగా పలు మార్పులతో సంస్థ ఈ కొత్త ఫోన్ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఫోన్లకు సంబంధించి అడ్వాన్సు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 2 నుంచి అన్ని ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్లలో అమ్మకాలు ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది. ఈ మొబైల్ 6జీబీ, 8జీబీ ర్యామ్లతో రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. దీనిని 2.7 గిగాహట్జ్ ఎక్సినోస్ 9810 ఆక్టాకోర్ ఎస్ఓసీ ప్రాసెసర్తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ ఇన్ఫినిటీ సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో మార్కెట్లోకి తెచ్చినట్టుగా సంస్థ తెలిపింది.