Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆర్ధిక మందగమనం దెబ్బతో గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో భారత్లో గృహ అమ్మకాలు 9 శాతం పడిపోయాయని ఓ రిపోర్టులో వెల్లడయ్యింది. 2018 ఇదే కాలంతో పోల్చితే దేశంలో నెలకొన్న ఆర్ధిక మందగమనం వల్ల క్రితం త్రైమాసికంలో ఎంపిక చేసిన తొమ్మిది నగరాల్లో గృహ అమ్మకాలు 60,453 యూనిట్లకు తగ్గాయని వెల్లడించింది. ఇదే సమయంలో కొత్త ప్రాజెక్టులు 10 శాతం తగ్గాయని హౌజింగ్ బ్రోకరేజీ సంస్థ ప్రొప్ఈక్విటీ పేర్కొంది. ముంబయి, థానే, బెంగళూరు, కోల్కత్తా, చెన్నరు, నోయిడా, గూర్గావ్, పూణె, హైదరాబాద్లో ఈ సర్వే చేపట్టినట్లు పేర్కొంది. హైదరాబాద్లో గృహ అమ్మకాలు 16 శాతం పతనమై 4,643 యూనిట్లకు పరిమితమయ్యాయి. ప్రస్తుత ఏడాది ముగింపు నాటికి మార్కెట్ రికవరీ కావొచ్చని అంచనా వేసింది.