Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: వచ్చే ఆర్ధిక సంవత్సరం 2020-21 బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. అయితే ఆ రోజు శనివారం కావడంతో స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయా... లేదా..?! అనే అనుమా నాలకు బీఎస్ఈ సెన్సెక్స్ వివరణ ఇచ్చింది. బడ్జెట్ ప్రవేశ పెట్టేరోజు శనివారం అయినప్పటికీ స్టాక్ ఎక్చ్సేంజీ పని చేస్తుందని బీఎస్ఈ ఓ సర్క్యూలర్ జారీచేసింది. సాధార ణంగా శని, ఆది వారాల్లో స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుం ది. ప్రీ-ఓపెనింగ్ ఉదయం 9:00 గంటల నుంచి 9:15 గంటలకు వరకు ఉంటుంది. అలాగే సాధారణ ట్రేడింగ్ ఉదయం 9:15నిమిలకు నుంచి 3:30ని.లకు వరకు ఉంటుందని బీఎస్ఈ వెల్లడించింది. మరో ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎన్ఎస్ఇ నిఫ్టీ నిర్ణయం వెలుపడాల్సి ఉంది. 2015లో అరుణజైట్లీ ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు ఫిబ్రవరి 28న శనివారం అయినప్పటికీ మార్కెట్లు పని చేశాయి.