Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వాణిజ్య విభాగం
జపాన్కు చెందిన ప్రముఖ అల్యూమినియం కిటికీల తయారీ బ్రాండ్ సంస్థ వైకెకెతో హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న యువిక్ గ్రూపు గురువారం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా తెలంగాణలోని శంకర్పల్లిలో రూ.4 కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు యువిక్ మేనేజింగ్ డైరెక్టర్ తరుణ్ సందీప్ తెలిపారు. తాము ఉత్పత్తి చేసే కిటికీలు, తలుపుల ధరలు చదరపు అడుగు ధర రూ.450 నుంచి రూ.3000 వరకు ఉంటుందన్నారు. తామే సొంత మార్కెటింగ్తో ఈ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తమ వద్ద 14 ప్రాజెక్టుల ఆర్డర్లు ఉన్నాయన్నారు. తమ గ్రూపు గతేడాది రూ.4 కోట్ల టర్నోవర్ నమోదు చేసిందన్నారు. ఈ ఏడాది రూ.6 కోట్ల టర్నోవర్ అంచనా వేస్తున్నామన్నారు. కొత్త ప్లాంట్ వల్ల సంస్థ సామర్థ్యం పెరగడంలో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు.