Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఎంజీ మోటార్స్ సంస్థ విద్యుత్ వాహనాల విభాగంలో సరికొత్త వాహనాన్ని అందుబాటులోకి తెచ్చింది. తాజాగా సంస్థ జెడ్ఎస్ ఈవీ పేరుతో భారత మార్కెట్లోకి సరికొత్త స్పోర్ట్స్ యుటిలిటీ (ఎస్యూవీ) వాహనాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇది పూర్తిస్థాయిలో విద్యుత్తులో పనిచేయనుండడం విశేషం. శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్ రాజీవ్ చాబా మార్కెట్లోకి ఆవిష్కరించారు. ఇందులో ఎక్సైట్ వేరియంట్ ధర రూ.20.88 లక్షలుగాను,. ఎక్స్క్లూజివ్ వేరియంట్ ధరను రూ.23.58లక్షలుగాను కంపెనీ నిర్ణయించింది. ఈ వాహనంలో 44.5 కిలోవాట్స్ శక్తి కలిగిన బ్యాటరీని ఉపయోగించారు. ఫలితంగా దీనిని ఒకసారి చార్జి చేస్తే 340 కిలో మీటర్ల వరకు ప్రయాణించవచ్చు. కేవలం ఎనిమిది సెనన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనుండడం ఈ కారు ప్రత్యేకత. ఈ వాహనం తప్పక వినియోగదారుల మనసును దోచుకోగలదని సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.