Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెంగాణ, వాణిజ్య విభాగం
ఔషధ, అహార ప్యాకేజింగ్ ఉత్పత్తులు ఎక్కువ కాలం మన్నికగా ఉండటానికి కావాల్సిన రసాయన శాచేలను అందించే సిలికెంట్ కెమ్ సంస్థ 2025 నాటికి రూ.200 కోట్ల రెవెన్యూ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ.50 కోట్ల టర్నోవర్ను నమోదు చేయనున్నామని ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ జైన్ తెలిపారు. ఔషధ ఉత్పత్తుల ప్యాకేజింగ్లో కీలక వాటా కలిగిన తమ కంపెనీ ఇటీవల అహారోత్పత్తులపై మరింత దృష్టి సారించిందన్నారు. గురువారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే రెండు, మూడేళ్లలో హైదరాబాద్లో ప్యాకేజింగ్ యూనిట్ నెలకొల్పే యోచనలో ఉన్నామన్నారు. తమ మొత్తం రెవెన్యూలో సగం వాటా ఈ నగరం నుంచే సమకూరుతుందని తెలిపారు. రూ.35-40 కోట్ల పెట్టుబడితో పూణెలో మూడో ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పరిశ్రమ రంగం ప్రతీ ఏడాది 18 శాతం పెరుగుతుంటే.. తమ కంపెనీ ఏకంగా 50 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని వివరించారు.