Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వాణిజ్య విభాగం:
ట్రావెల్స్, టూరిజం రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న సదరన్ ట్రావెల్స్ సంస్థ ఔత్సాహికులైన పర్యటకుల కోసం నేటి (24వ తేదీ) నుంచి 'హాలిడే బజార్'లను నిర్వహించనుంది. దేశ, విదేశాలలోని పర్యటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలకు సంబంధించిన ప్యాకేజీలను పరిచయం చేసే ఉద్దేశంతో వీటిని సంస్థ ఏర్పాటు చేస్తోంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ హాలిడే బజార్లు 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి. హైదరాబాద్లోని లక్డీకాపూల్, కూకట్పల్లిలో గల సంస్థ కార్యాలయాలతో పాటు ఈసీఐఎల్ క్రాస్రోడ్డులోని హౌటల్ సితారా గ్రాండ్, వరంగల్లోని హన్మకొండలో ఉన్న సదరన్ ట్రావెల్స్ కార్యాలయం, కరీంనగర్లోని వేములవాడ రోడ్డులో ఉన్న సదరన్ ట్రావెల్స్ కార్యాలయం, నిజామాబాద్లోని హౌటల్ కపిల, ఖమ్మంలోని బడ్జెట్ హౌటల్, వైజాగ్లోని సదరన్ ట్రావెల్స్ కార్యాలయం, రాజమండ్రిలోని సదరన్ ట్రావెల్స్ కార్యాలయం, కాకినాడలోని ఎస్వీఎస్ గ్రాండ్ హౌటల్, శ్రీకాకుళంలోని హౌటల్ బ్లూఎర్త్ల్లో ఈ హాలిడే బజార్లను నిర్వహించనున్నారు. ఇందులో డొమెస్టిక్ టూర్లను బుక్ చేసుకునే వారికోసం 'మెగా లక్కీ డ్రా'ను నిర్వహించి విజేతలుగా నిలిచిన 15 మందికి దేశ, విదేశీ టూర్లను బహుమతిగా ఇవ్వనున్నారు.