Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ''కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'' (క్రెడారు) ఈనెల 31 నుంచి హైదరాబాద్లో భారీ ప్రాపర్టీషోను నిర్వహించనుంది. ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఇది కొనసాగనుంది. మాదాపూర్లోని హైటెక్స్లో మూడు రోజులపాటు జరిగే ఈ ప్రాపర్టీషోలో నగర వ్యాప్తంగా ఉన్న రియల్టర్లు, బిల్డింగ్ మెటీరియల్ మాన్యుఫాక్చరర్లు, కన్సల్టెంట్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వారు పాలుపంచుకోనున్నట్టు క్రెడారు హైదరాబాద్ విభాగం అధ్యక్షులు పి.రామకృష్ణారావు తెలిపారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో క్రెడారు జనరల్ సెక్రెటరీ వి.రాజశేఖర్రెడ్డి, ఉపాధ్యక్షులు మురళీమోహన్, రాజేశ్వర్, వేణు వినోద్, జైదీప్తో పాటు కోశాధికారి ఆదిత్యగౌరలు ఈ ప్రాపర్టీషో ఇతర వివరాలను వెల్లడించారు. ఈ ప్రదర్శనలో రియల్ ఎస్టేట్ రంగంలోని అత్యాధునిక ఆవిష్కరణలను, ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నట్టు తెలిపారు. నగరంలోని ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, రిటైల్ కమర్షియల్ కాంప్లెక్స్ ప్రాజెక్టులను ప్రదర్శనకు ఉంచనున్నట్టుగా ఆయన తెలిపారు. ఈ షోలో 15000లకు పైగా యూనిట్లను క్రెడారు హైదరాబాద్ విభాగం సభ్యులైన డెవలపర్లు ప్రదర్శనకు ఉంచనున్నారని వారు తెలిపారు. ఈ ప్రదర్శనలో దాదాపు 80 స్టాల్స్ను అందుబాటులో ఉంచనున్నట్టుగా వారు వివరించారు. అందుబాటు ధరలో ఉన్న వివిధ ప్రాజెక్టుల కూడా తాము ఈ ప్రదర్శనలో పరిచయం చేయనున్నట్టుగా వారు తెలిపారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు సూచించారు.