Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నికర లాభం రెండింతలకు పైగా పెరుగుదల
ముంబయి: ప్రయివేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. అక్టోబరు-డిసెంబరు మధ్య కాలంలో బ్యాంక్ నికరలాభం రెండు రెట్లకు పైగా పెరిగి రూ. 4,146.46 కోట్లుగా నమోదు అయింది. 2018 ఏడాది అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో కంపెనీ నమోదు చేసిన రూ. 1,604.91కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 158శాతం ఎక్కువ కావడం విశేషం. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం కూడా 17.23 శాతం పెరిగి రూ. 23,638.26 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్ ఆదాయం రూ. 20,163.25కోట్లుగా ఉంది. ఇక ఈ త్రైమాసికంలో బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు కూడా 7.75 శాతం నుంచి 5.95 శాతానికి పడిపోయాయి. విలువ పరంగా స్థూల మొండి బకాయిలు రూ. 43,453.86 కోట్లకు తగ్గాయి. 2018 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో ఇవి రూ. 51,591.47 కోట్లుగా ఉండేవి. ఇక నికర నిరర్ధక ఆస్తులు కూడా 2.58శాతం నుంచి 1.49శాతానికి తగ్గాయి. ప్రొవిజన్లు (పన్నులు మినహా) 51శాతం తగ్గి రూ. 2,083కోట్లుగా నిలిచాయి. చందా కొచ్చర్ సారథ్యం నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ వెరుపడినప్పటి నుంచి బ్యాంక్ ఇంతటి మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడం ఇదే తొలిసారి.