Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: బ్యాంకింగ్ రంగంలో పరిశోధనలు, ప్రచురణలు, సామర్థ్యం పెంపు విషయంలో పరస్పరం సహకరించుకొంటూ ముందుకు సాగేందుకు గాను భారతీ య స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లు జట్టుక ట్టాయి. విద్యా పరిశోధనలకు ఆచరణాత్మక అనుభవాలతో జోడించడం ద్వారా డిజిటల్ పరివర్తనాలపై విలక్షణమైన కంటెంట్ను అభివృద్ధి చేసే దిశగా ఇరు సంస్థలు హైదరాబాద్లో ఒక అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయు) కుదర్చుకున్నాయి. ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ (స్ట్రాటజీ), చీఫ్ డిజిటల్ ఆఫీసర్ జె.స్వామినాథన్, ఎస్బీఐ డీన్ డాక్టర్ రాజేంద్ర శ్రీవాస్తవ్లు ఈ ఎంవోయూపై సంతకాలు చేశారు. ఎస్బీఐ ఆరంభం నుంచి ఇటీవల బ్యాంక్ అందుబాటులోకి తెచ్చిన యోనో డిజిటల్ వ్యవస్థ విజయవంతమవడం వరకు వివిధ అంశాలపై పరిశోధనలు జరుపుతూ వాటికి సంబంధించి కేస్ స్టడీస్ను సంస్థ ఐఎస్బీ రూపొందించనుంది. వీటిని ఆధారంగా చేసుకొని ఇతర విత్త సంస్థలకు అనువైన విధానాలను అందుబాటులోకి తేవడానికి వీలు పడుతుందని ఇరు వర్గాలు తెలిపాయి. బ్యాంక్ కార్యకలాపాల పనితీరును గురించి దేశంలోనే అత్యుత్తమ బిజినెస్ స్కూల్ ఐఎస్బీ ద్వారా వివిధ రకాల పరిశోధనలు చేసించి, వాటిని ముద్రించేందుకు సంస్థ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరంగా నిలువగలదని స్వామినాథన్ ఆనందం వ్యక్తం చేశారు.