Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేటింగ్ యథాతథం
- 'బీబీబీ-'గా కొనసాగింపు : ఎస్అండ్పీ
న్యూఢిల్లీ : భారత్ సార్వభౌమ రేటింగ్ను యథాతథంగా 'బీబీబీ-'గా కొనసాగిస్తున్నట్టు అంతర్జాతీయ రేటింగ్స్ ఎజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్అండ్పీ) వెల్లడించింది. కాగా పెరిగిన ద్రవ్యలోటు, పెరుగుతున్న ప్రభుత్వ రుణాల కారణంగా కొంత అనిశ్చితి ఉందని హెచ్చరించింది. భారత్ ఆర్థికాభివృద్ధిరేటు 2019-2020లో 5 శాతానికి తగ్గుతుందని విశ్లేషించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 6 శాతానికి పెంజుకుంటుందని అంచనా వేస్తున్నట్లు ఎస్అండ్పీ తెలిపింది. భారత జీడీపీ వచ్చే రెండు, మూడేండ్లలో క్రమేపీ దీర్ఘకాలిక సగటుస్థాయికి చేరుకోవచ్చని పేర్కొంది. కరోనా ప్రభావంతో ప్రపంచ టెక్నాలజీ సెక్టార్కు కూడా ప్రమాదం పొంచి ఉన్నదనీ, ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ హెచ్చరించింది. వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ఆయా దేశాలు ఎక్కడిక్కడ ప్రయాణ పరిమితులను విధించడం, అతిపెద్ద ఎలక్ట్రానిక్ మార్కెట్ అయిన చైనాలో పరిశ్రమలు మూతపడటంతో టెక్నాలజీ విస్తరణకు భారీ అవరోధాలు ఏర్పడ్డాయని ఎస్అండ్పీ తెలిపింది. వైరస్ కారణంగా మార్కెట్లన్నీ లూనార్ న్యూఇయర్ వరకు మూతపడి ఫిబ్రవరి 10న తెరుచుకుంటాయనుకుంటే ఇప్పటికీ అక్కడి పరిస్థితులు అదుపులోకి రాలేదని ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో హార్డ్వేర్, ఎలక్ట్రానిక్ మాన్యూఫాక్చరింగ్ సర్వీస్ ప్రొవైడర్స్, సెమీకండక్టర్ కంపెనీల త్పత్తులు ఆగిపోవడంతో టెక్నాలజీ రంగం క్షీణిస్తుందని విశ్లేషించింది.