Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆటోమే షన్తో భారత్లో తొమ్మిది శాతం మంది ఉద్యోగులు నిరుద్యోగులుగా మారే ప్రమాదం ఉందని ఐఎం ఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డేవిడ్ లిప్టన్ విశ్లేషించారు. న్యూఢిల్లీలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్) నిర్వహించిన కార్యక్రమంలో లిప్టన్ మాట్లాడుతూ ఆటోమేషన్ ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 14 శాతం మంది అంటే దాదాపు 37.5 కోట్ల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోవచ్చని పేర్కొన్నారు. తక్కువ వేతనాలు, అధిక కార్మికులు అవసరమైన పరిశ్రమల్లో ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాలు పోయే పరిస్థితి అధికంగా ఉంటుందన్నారు. మధ్యంతర వస్తువులపై సుంకాలు విధించడం వల్ల ఉద్యోగాల సృష్టికి కారణమయ్యే పారిశ్రామిక రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. గ్రామీణ వినిమయం తగ్గడం, ఎగుమతుల వృద్ధి పతనమవడం, నిరుద్యోగం దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులుగా మారాయన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు న్యాయ, రెగ్యులేటరీ పరమైన చిక్కులను తొలగించాలని అన్నారు.
ప్రస్తుత మాంద్యంలో భారత్ 6-7 శాతం వృద్ధి నమోదు చేసేలా చేస్తే ప్రజలకు కొంత మేలు జరుగుతుందన్నారు. స్వల్పకాలంలో పోటీతత్వం కొంత ఇబ్బందికరమే అయినా దీర్ఘకాలంలో కంపెనీలు స్వతంత్రంగా ఎదిగేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ వృద్ధి రేటు మందగించిందని, దీని ప్రభావం ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత్పై పరిమితంగానే ఉంటుందని పేర్కొన్నారు.