Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటో కార్ప్ తన స్ల్పెండర్ ప్లస్ను బీఎస్-6 వెర్షన్తో తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధరను రూ.59,600 గా నిర్ణయించింది. దీంతో పాట బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా రెండు స్కూ టర్లను కూడా ఆవిష్కరించింది. డెస్టినీ 125, మాస్ట్రో ఎడ్జ్ 125 పేరుతో తీసుకొ చ్చింది. ఢిల్లీ ఎక్స్షోరూం వద్ద వీటి ధరలను వరుసగా రూ.64,310, రూ.67,950గా నిర్ణయించింది. కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ పోర్ట్ఫోలియోను విస్తరించా మని హీరో మోటోకార్ప్ హెడ్ (గ్లోబల్ ప్రొడక్ట్ ప్లానింగ్) మాలో లే మాసన్ అన్నారు.